ద్విభాషా రచయిత్రి – కేతకీ కుశారి దిసాన్

unnamedబెంగాలీ ,ఆంగ్ల భాషల్లో విపులమైన రచనలు చేసిన కేతకీ కుశారి దిసాన్ పశ్చిమ బెంగాలోని కలకత్తా నగరం లో 1940లో జన్మించింది .కలకత్తా ,ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి రెండు చోట్లా సర్వ ప్రధమురాలిగా ఉత్తీర్ణత సాధించింది  .1964లో ఇంగ్లాండ్ దేశీయుడిని వివాహం చేసుకోవటం వలన ఆమె అక్కడే ఉంటోంది .బెంగాలీ ఆంగ్లాలలో రచనలు చేసి సవ్య సాచి అనిపించుకొన్నది .ఇలా చేసిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు .సాహిత్యం లోని దాదాపు అన్నిప్రక్రియల్లోను రచనలు  చేసింది కేతకీ .కవిత్వం ,కద, నవల ,విమర్శ, నాటకం ,వ్యాసం అనువాదాలు చేసి తన సామర్ధ్యాన్ని నిరూపించుకోన్నది .ఆమెది పరిశీలనాత్మకమైన పరిశోధనాత్మకమైన దృక్పధం .అందువలన విషయాల లోతులను తరచి రాసి  సంపూర్ణత నిస్తుంది .బెంగాలీ భాషలో ఆరు కవితా సంపుటాలను ,ఇంగ్లీష్ లో నాలుగు సంపుటాలను రాసి ప్రచురించింది .1944లో మాంచెస్టర్ సిటీ ఆఫ్ డ్రామా లో మొదటి నాటకాన్ని బెంగాలీ భాషలో ప్రదర్శించారు. 91ఆతర్వాత ఆమె దాని ఆంగ్ల అనువాదం తో ఇంగ్లాండ్, వేల్స్ దేశాలు పర్యటించి ప్రదర్శనలను నిర్వహించింది .1991లో రవీంద్ర నాద టాగోర్ కవితలను ఆంగ్లం లోకి అనువదించి ‘’పోఏట్రి బుక్ సొసైటీ రికమండెడ్ ట్రాన్స్ లేషన్ ‘’గా ఆమోదం పొంది ఘన విజయాన్ని సాధించింది .2003బెంగాలీ ప్రముఖ కవి బుద్ధ దేవ బోస్ కవితలను ఇంగ్లీష్ లోకి అనువదించి పై రీతిగానే ఆ సొసైటీ ఆమోద ముద్ర సాధించింది .

   కేతకీ పరిశోధనాత్మకమైన రచనలలో రెండు చాలా ప్రసిధమైనవి ఉన్నాయి. వీటిని’’ స్కాలర్లీ బుక్స్ ‘’అన్నారు .అందులో ఒకటి 1765-1856మధ్యకాలం లో వచ్చిన బ్రిటిష్ జర్నల్స్ ,మరియు జ్ఞాపకాలు .దీనికి  ‘’ది వేరియస్ యూని వర్స్ –ఏ స్టడీ ఆఫ్ జర్నల్స్ అండ్ మెమాయిర్స్ బ్రిటిష్ మెన్ అండ్ విమెన్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్’’అని పేరు పెట్టింది .దీన్ని ధిల్లీ లోని ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి ప్రెస్ ముద్రించింది . రెండవ రచన రవీంద్రునికి ,అర్జెంటీనా దేశపు విదుషీమణి ‘’విక్టోరియా  ఒకాంపో ‘’మధ్య ఉన్నసాహిత్య ,సాంస్కృతిక  సంబంధాలు .దీనిపేరు ‘’ఇన్ యువర్ బ్లాసమింగ్ ఫ్లవర్ గార్డేన్ –రవీంద్ర నాద టాగోర్ అండ్ విక్టోరియా ఒకాం పో ‘’ఇది కేంద్ర సాహిత్య అకాడెమి ప్రచురణ .ఈ రెండూ కూడా పునర్ముద్రణ పొందాయి .మరొక ప్రసిద్ధ పరిశోధనాత్మక రచన ఇతరపరిశోధకులతో  కలిసి చేసిన టాగోర్ రచనలు ,కళల పై ‘’ప్రోటానోపిక్ కలర్ విజన్ ‘’ప్రభావం .ప్రోటానోపిక్ అంటే  దృష్టిలో వచ్చే ఒకరక మైన రంగు దోషం .2002 జనవరిలో కేతకి రాసిన రెండవ  బెంగాలీ నాటకం కలకత్తా నగరం లో ప్రదర్శింప బడింది .బెంగాలీ సాహిత్యానికి ఆమె చేసిన సేవలకు ‘’ఆనంద పురస్కారాన్ని’’రెండు సార్లు  అందుకొన్నది .కలకత్తా  విశ్వ విద్యాలయం కేతకీ కుశారి కి ‘’భువన మోహిని దాసీ ‘’అవార్డ్ నిచ్చి సత్కరించింది .’’ఉత్తమ బెంగాలీ నారీమణి’’పురస్కారాన్ని అందుకొన్నది . కేతకీ కొంతకాలం ‘’ఆక్స్ ఫర్డ్ సెంటర్ ఫర్ క్రాస్ కల్చరల్ రిసెర్చ్ ఆన్ విమెన్ ‘’లో రిసెర్చ్ అసోసియేట్ గా పని చేసింది .ఈ అనుభవం తో ‘’బై లింగ్యువల్ విమెన్ – యాంత్ర పోలాజికల్ అప్రోచెస్ టు సెకండ్ లాగ్వ్వేజ్ యూజ్ ‘’అనే వ్యాస సంకలానికి  సంపాదకత్వం వహించింది .

 బెంగాలీ ఇంగ్లీష్ భాషలలో తాను  రచనలు చేసి అందరికి సంతృప్తి  కలగా జేయటమే  తన ధ్యేయం గా కేతకీ చెప్పుకొంటుంది . ఇంగ్లాండ్ లో ఉంటున్నప్పటికీ తన మాతృభూమి బెంగాల్ ను ,అక్కడి విద్యా వేత్తలను ఎన్నడూ మరచిపోలేదని నిరంతర సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నానని చెప్పింది . తన రచనలు పుస్తక రూపం దాల్చక ముందు బెంగాలీ మేగజైన్ లలోనే అచ్చు అయ్యేవన్నది .బెంగాలీ భాష మాట్లాడే బంగ్లాదేశ్ లోను ,ప్రపంచం లో ఎక్కడెక్కడో ఉన్న బెంగాలీలు తన రచనలను ఇష్టపడి చదవటం తన అదృష్టం అన్నది . అందుకే తాను  ద్విభాషా రచయిత్రిగా బాగా గుర్తింపు పొందానని చెప్పింది .తన కవితలు రెండుభాషల  పత్రికలలోనూ ముద్రింప బడేవని ,కనుక ఆ భాషల మూలాలు తనకు బాగా తెలుసునని ,అందుకే ఇంతటి ఆదరణ లభిస్తోందని కేతకీ అభిప్రాయ పడింది .తాను  రాసిన ఫిక్షన్ కాని నాటకాలు కాని బెంగాలీ భాష లోనే రాశానని చెప్పింది .ఆ సమాజం ,జీవన విధానం భాషా ఆలోచనలు ప్రతి  బింబించాలి లంటే తన మాతృ భాష బెంగాలీ  మాత్రమె ఉపయోగపడుతుంది అని  తనకళ్ళు బెంగాలీ నేపధ్యాన్ని బాగా చిత్రీకరించటానికి కేంద్రీకరిస్తాయని భావించి రాయటం జరిగింది అని చెప్పుకొన్నది .అందుకనే ఇంగ్లాండ్ లో కూర్చుని రాసినా బెంగాలీ కదా ,నవల నాటకాలు రాశానని చెప్పింది .సృజనకు ,మేధ కు మధ్య ఉన్న  అంతరాన్ని  తగ్గించాలనే దృక్పధం తోనే తానూ మొదటినుంచి రచనలు చేశానని చెప్పింది .ఇది దీర్ఘ కాలం గా తన మనసులో ఉన్న  కోరిక  అని, దాన్ని నెరవేర్చటానికి  శాయ శక్తుల కృషి చేసిన సంతృప్తి తనకు లభించిందని అన్నది .తన రెండవ నవలలో విక్టోరియా ఒకాం పో  ,జూడో స్పానిష్ రచయిత లాడినో లు రాసిన పాటలను చేర్చానన్నది .తన పరిశోధనలన్నీ హేతు బద్ధం గా, బుద్ధి కుశలత తో చేసినవే నని చెప్పింది ..తాను రెండు భాషల, రెండు దేశాల సంస్కృతులకు చెందిన దాన్ని అని ,అంతర్ జాతీయ సంస్కృతీ అవసరం అని భావిస్తానని చెప్పింది .అందుకే తన అనువాదాలలో ఆయా దేశాల సంస్కృతిని గురించి  ముందే విపులమైన  ఉపోద్ఘాతం  రాస్తానన్నది .దీనివలన ఇతర జాతీయ సంస్కృతీ పట్ల అవగాహన ఏర్పడి గౌరవం కలుగుతుంది అని విశ్వసించింది  

 ఆమె తాజా రచనలలో ఒకటి ‘’తిసిదోర్’’.ఇందులో .ఇరవై వ శతాబ్దికి చెందినప్రముఖ రచయితలైన  ‘’జీవనానంద దాసు’’, ‘’బుద్ధ దేవ బోస్’’ ల పై రాసిన పుస్తకం .ఇది డాక్యుమెంటరి కి అనువైన ఆంగ్ల నేపధ్యం ఉన్న రచన .ఈ రచనకు 2009లో ఉత్తమ బెంగాలీ రచన గా పేరుపొంది ట్రోఫీని సాధించింది .రెండవది ‘’ఏక బింఘా శతాబ్ది తే రబీంద్ర చర్చ –ఒ అనన్య ప్రబొందో ‘’.ఇందులో అనేక విషయాలపై  వ్యాసాలూ ,సమీక్షల తో బాటు రవీంద్రునికి సంబంధించిన వ్యాసాలూ ఉన్నాయి .ఈ పుస్తకాన్ని 2010లో కలకత్తాలో ప్రచురించారు .

 పశ్చిమ  బెంగాల్ లోని లోని విశ్వ భారతి విశ్వ విద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసింది .జర్మనీలో టాగోర్ రచనలు కళలు పై అధ్యయనం చేయటానికి జర్మన్ దేశపు గాలరీలు మ్యూజియం లను స్టడీ టూర్ లో సందర్శించింది .1997లో హాల్స్ యూనివర్సిటి సదరన్ ఆర్ట్స్ ట్రెయినింగ్ అండ్ ట్రాన్స్లేషన్ సదస్సులో పాల్గొన్నది .సమకాలీన నవలా సదస్సు లో తన అనుభవాలను పంచుకోన్నది .విక్టోరియా ఒకాం పో  పై జరిగిన రిసెర్చ్ ప్రాజెక్ట్ కు ప్రాతినిద్యం వహించింది .యునేస్కోలో అర్జెంటీనా తరఫున శాశ్వత ప్రతినిధిగా గౌరవ స్థానాన్ని పొందింది .’

2010లో కలకత్తావచ్చి    ‘’రవీంద్రుని రచనా ప్రభావం ‘’పై ‘’అమేయ గుప్తా స్మారక ఉపన్యాసం’’ ఇచ్చింది కేతకీ .అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం లో ఉన్న’’ నాష్ విల్’’ లో ‘’బంగ మేళ ‘’లో పాల్గొన్నది .స్లావేనియాలోని జుబ్లానా యూని వర్సిటిలో జరిగిన రవీంద్రుని నూట యాభై వ శత జయంతి సంబరాలలో భాగ స్వామిని అయింది .లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లో ‘’ఉద్యానవనాలు ,ప్రక్రుతి ,లపై భారతీయ కవిత్వం ‘’పై సెమినార్ నిర్వహించింది .లండన్ లో భారతీయులకు వేసవి శిక్షణా  తరగతులు నిర్వహిస్తోంది .2009లో కలకత్తా లో యునేస్కో ఆధ్వర్యం లో రామకృష్ణా మిషన్ నిర్వహించిన ‘’అనేకత్వం లో ఏకత్వం ‘’సదస్సులో కీలక ఉపన్యాసం చేసి, పాల్గొన్న వారితో ఇస్తా గోష్టి నిర్వహించింది .ఈ విధం గా ఇంగ్లాండ్ లో ఉంటున్నా భారత దేశం తో ను ముఖ్యం గా బెంగాలీ సమాజం తోనూ బెంగాలీ భాషతోను సత్సంబంధాలను నెలకొల్పుతూ భిన్నత్వం లో ఏకత్వాన్ని దర్శిస్తూ  ,బోధిస్తున్న కేతకీ  కుశారీ దిసాన్ ‘’డెబ్భై అయిదేళ్ళ వయసులోనూ భారత్ బ్రిటన్ దేశ సాంస్కృతిక రాయబారిగా సేవాలిందిస్తూ కేతకీ పుష్ప సుగంధాన్ని పంచుతున్నది .దీర్ఘాయుష్మాన్ భవ .

                                                                                                                                    –  గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో