ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీ సి.హెచ్.మన్మథ రావు గారు విచ్చేసి విద్యార్థులు తెలుగు భాష పైన సంస్కృతి పైన అభిమానాన్ని పెంచుకోవాలని, తెలుగు నేల పై ఎన్ని యాసలు ఉన్నా మనమంతా తెలుగు వారమని ప్రసంగించారు.
తెలుగు శాఖాధిపతి అయినా డా.యస్.జ్యోత్స్నా రాణి సంపాదకత్వం లో వెలువడిన “విద్యార్థి వ్యాస కృత్యాలు ” పుస్తకాన్ని కరస్పాండెంట్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సభలో వారం రోజులుగా జరిగిన భాషా వారోత్సవాలలో గెలుపొందిన బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.
ఈ సభకి డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ dr.p. v. d. శ్రీదేవి, వైస్ ప్రిన్స్ పాల్ dr.R. రఘురాం మరియు జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ N.వెంకట్ రావు గార్లు పాల్గొన్నారు.
ఆత్మీయ అతిధి గా విచ్చేసిన డా. అరసి శ్రీ గారు నేటి తెలుగు భాషని అంతర్జాలంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలో అనే అంశం పై విద్యార్థులకు అవగాహన కలిగించారు.
జూనియర్ కళాశాల రిటైడ్ తెలుగు లెక్చరర్ K. కుసుమ కుమారి గారు ప్రాచీన తెలుగు భాషలోని మాధుర్యాన్ని తెలిపారు. ఈ కార్యక్రమానికి కామర్స్ విభాగాధిపతి M. శోభా రాణి, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ D. స్ఫూర్తి మేడం మరియు కళాశాల బోధనేతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~