ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం , హైదరాబాదు విశ్వ విద్యాలయం , తెలుగు సాహిత్య అధ్యయన శాఖ , పిట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త నిర్వహణలో అవధాన ప్రక్రియ – విద్వాంసుల కృషి అనే అంశం పై రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది . ప్రారంభోత్సవంలో ఆచార్య యస్ .శరజ్యోత్స్నారాణి అధ్యక్షత వహించగా ,కీలక ఉపన్యాసం ఆశావాది ప్రకాశరావు చేసారు .
మొదటి రోజు మొదటి సమావేశానికి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సభాధ్యక్షత వహించగా పలువురు పత్ర సమర్పణలు చేసారు . రెండవ సమావేశానికి డా. తిరునగరి సభాధ్యక్షత నిర్వహించగా , మరికొంత మంది పత్ర సమర్పణ చేసారు ఈ విభాగానికి డా .హేమలత పుట్ల సమన్వయ కర్త గా వ్యవహరించారు .
సాయంత్రం టీ విరామం తరవాత అష్టావధానం జరిగింది . అవధానులుగా శ్రీ బులుసు అపర్ణ , శ్రీ పుల్లాభట్ల నాగాశాంతి స్వరూప , నిషిద్దాక్షరి – శ్రీ పొన్న పల్లి శ్రీరామారావు , అప్రస్తుత ప్త్రసంగం – శ్రీ సుశర్మ , వర్ణన – శ్రీ సన్నిధానం నరసింహ శర్మ , వ్యస్తాక్షరి – శ్రీ అక్కిపెద్ది రామ సూర్యనారాయణ , దత్తపది – డా . తలారి వాసు , పురాణ పఠనం – డా . గుత్తి సుబ్రహ్మణ్య శాస్త్రి . సమస్యా పూరణం – శ్రీ చిలుకూరి ఫణి కుమార్ పృచ్చకులుగా పాల్గొన్నారు .
రెండవ రోజు మొదటి సమావేశానికి డా .దావులూరి కృష్ణ కుమారి అధ్యక్షత వహించగా పలువురు పత్ర సమర్పణలు చేసారు. రెండవ సమావేశానికి ఆశావాది ప్రకాశరావు సభాధ్యక్షత నిర్వహించగా మరికొంత మంది పత్ర సమర్పణ చేసారు ఈ విభాగానికి పి .రాములు సమన్వయ కర్త గా వ్యవహరించారు .
సమాపన కార్యక్రమానికి ఆచార్య యస్ .శరజ్యోత్స్నారాణి అధ్యక్షత వహించగా సదస్సు నివేదికను ఆచార్య జి.యస్ . భాస్కర్ తెలియజేశారు . ఈ కార్యక్రమానికి పలువురు సాహీతీ ప్రముఖులు , సాహిత్య పీఠం విద్యార్ధులు , పరిశోధకులు , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు .
– విహంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to అవధాన ప్రక్రియలు – విద్వాంసుల కృషి