అక్షరాల ‘అగ్నిశిఖ’ లు

      స్త్రీ అంటే శరీరం అని పర్యాయ పదమైన చోట ఎప్పుడైనా ఆమె తనువుపై నిరంతరం దాడులు కొనసాగుతూనే వుంటాయి .పితృస్వామ్య  వ్యవస్థ లో మహిళా అంటే ఒక భోగ్య వస్తువు . ఒక మార్కెట్ సరుకు అని రూడి  అయిన వేళ నగరంలోనైనా అరణ్యం లోనైనా వీధి లోనైనా , ఇంట్లో నైనా , లిప్ట్ లోనైనా స్త్రీల దేహాల మీద దాడి జరుగుతూనే వుంటుంది .

                       ఈనాడు సినిమాల్లో , టి .వి ల్లో , నెట్ లో  స్త్రీని ఒక భోగ వస్తువుగా ప్రదర్శిస్తున్నారు . బుల్లి తెరపై , వెండి తెరపై స్త్రీని ఒక అవయవ ప్రదర్శన శాలగా చూపిస్తున్నారు . భారత దేశ రాజధానీ నగరంలో జరిగిన నిర్భయ ఉదంతం దేశ మంతటినీ కల్లోల పరచింది . స్త్రీల దేహాలు గాయపడిన  నదులైనా ఆత్మ న్యూనతా భావంతో కుంగిపోలేదు .

స్త్రీలు తమపై జరుగుతున్న లైంగిక దాడుల్ని సహించి ఊరుకోవడం లేదు . హింసను సహించడం లేదు . ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా  పిడికిలి బిగిస్తున్నారు . ప్రశ్నల కరవాలాలను ఝులిపిస్తున్నారు .

      సంఘంలో స్త్రీల పట్ల జరుగుతున్న హింసా కాండకు రచయిత్రుల ప్రతి ఘటనా రచనలే ఈ అగ్ని శిఖ పుస్తకం . అతివల నిత్య జీవితాలలో  గృహ హింసో , అత్యాచారమో ఏదో ఒకటి వారిపై నిరంతరం దాడి జరుగుతున్న దశలో ఈ హింసను వ్యతిరేకిస్తూ  తమ అక్షరాలనే అగ్ని శిఖలుగా వెలిగించి ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని ధిక్కరిస్తున్నారు .

ఈ పుస్తకాన్ని ప్రజా స్వామ్య రచ్జయిత్రుల వేదిక వారు ప్రచురించారు . దీనిలో కథలు , కవితలు , వ్యాసాలు , సమీక్షలు , కథనం  ఇలా వివిధ ప్రక్రియల్లో రాసిన   రచనలున్నాయి . అనాది నుంచి ఆధునిక  యుగం వరకు ఆడపిల్లను ఒక అందాల బొమ్మగా  ఒక మర బొమ్మగా భావిస్తున్నారు . సాహిత్యంలో సమాజంలో ఇప్పటికీ సౌందర్యానికి ప్రతీకగా స్త్రీని , పరాక్రమానికి ప్రతీకగా పురుషుని భావిస్తున్నారు . 21 వ శతాబ్దంలో నూ  ఈ భావాలు మారలేదు . యుద్ధాలు జరిగినప్పుడు శత్రు దేశాల మీదకు దండెత్తి ఆ దేశాలను జయించినపుడు  ఆ దేశాల స్త్రీల దేహాలపై గూడు దాడి చేయడం ఒక అలవాటై పోయింది .

           బాధా శాప్తనది  కవితలో కొండేపూడి నిర్మల గారు “ కలల్ని  కన్నీటి చాటున జార విడిచాం / కళ్ళను  రెప్పల వెనుక చిదిమి ఉంచాం / కడుపు కడుపునా  ఆ కిరాతక మూక పాతిపోయిన / భయో త్పాతాల నెలా దాచుకోగలవు ? / అని ఆవేదనతో “ బోస్నియా లోని రిజ్వినో లిపి బాదాశాప్తన ది కాగా / ఉన్న పళాన  విరుచుకు పడ్డ సెక్స్ పశువుల తొక్కిసలాటకి / మా ప్రపంచం మట్టి కొట్టుకు పోయింది /” అని ఆ సైనికుల  దాడిలో గాయపడిన స్త్రీల బాధ లగాధలను కన్నీటి లిపిలో వర్ణిస్తారు .

    శరీర న్యాయం రెండో అధ్యాయంలో ఘంటశాల నిర్మలగారు స్త్రీలు ఏ నేరం చేయక పోయినా వాళ్ల దేహాలపై దాడులు జరుగుతాయని “ మనదారిన మనం  పోతామా / అడుగడుగునా  ఆపద లు / క్షణం ఏ మారితే చిరుత పులులు వరదలు / సామాజిక అధికారం సంపాదీకృత   అహంకారం కలిసి / ఆధునిక చిరుత పులిని  ఆదిమ పిశాచం  చేస్తాయి / అది క్రూర కాంక్షల జూలు విదిల్చి హుంకరిస్తుంది “ అంటూ కాముకుల కౄరత్వాన్ని వివరిస్తారు  .

   ఆంధ్ర ప్రదేశ్ లో వాక పల్లిలో గిరిజనులపై  జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే . ఒక రోజు తెల్ల వారు జామున గిరిజన స్త్రీలపై జరిగిన అత్యాచారం గురించి వర్ణిస్తూ “ నెత్తుటి  నదిలో నెల వంకలు “ కవితలో ప్రతిమ గారు ఉదయించే సూర్యుడి సాక్షిగా / కుక్కల కొడుకుల కామక వారు  మింగుడు పడక / ఘనీభవించి పోయిన పసుపు తోట / ఇప్పటికీ గాయంలో   మగ్గుతున్న నెత్తుటి గడ్డ / అంటూ అక్కడ పోలీసులు చేసిన దాడిని గురించి “ రాజ్యం చెక్కిలి మీద కూంబింగ్ పోలీసులు చిమ్మిన బురదని / ఏ బహుళ జాతి సెంటు తుడవ లేదు / వాకపల్లి కళ్లల్లో ఇప్పటికీ / సూర్యుడు నల్లగానే ఉదయిస్తున్నాడు / అంటూ ఆ గిరిజన మహిళల బాధలను వ్యాఖ్యానిస్తారు . 

స్త్రీల శరీరాలనే లక్ష్యంగా చేస్తున్న మగ ప్రపంచాన్ని పసుపులేటి గీత గారు విశ్లేషిస్తూ “ శరీర మొక  చారిత్రక తప్పిదమై పోయింది / రెండు పెదవులు , రెండు చెక్కిళ్లు / రెండు రొమ్ములు , రెండు తొడలు / రెండంకెల అందాలు / రెండు రెళ్ళు  నూకలు చెల్లే  నూరేళ్ళా అంటూ ప్రక్కనున్న ప్రతి వాడూ / తొడల మధ్య బర్లేన్ని / మోసుకు తిరుగుతున్నట్లే వుంది /” అంటూ ఈ పురుషాధిక్య ప్రపంచంలో “ రక్షణ శాఖోప శాఖలై / నమ్మకాల్ని బాష్ప వాయు మేధామై కమ్మేస్తుంది / పోరిగిల్లూ , నట్టిల్లూ కూడా / పచ్చి గాయమై పలవరిస్తుంటాయి “ అని దేహాలే గాయాలుగా మారిపోవడాన్ని వివరిస్తారు .

  “ కాంక్ష భ్రమరం “ కవితలో మందరపు హైమవతి తెహల్కా ఎడిటరే  కావచ్చు ! అదను చూసి పంజా విసిరే మృగా  ద్ర ముడే / “ అని అంటూ ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళల శరీరాలంటే మాంసపు ముద్దలని / మార్కెట్ వస్తువులని ప్రచారం చేస్తున్న వేళ / ఇంట్లో నైనా వీధిలోనైనా లిప్ట్ ల్ప్నైనా / పదే పదే  తనువులపై దాడి చేస్తూ హృదయ శిశువులను హననం చేసే కంస మామలే ఈ లోకం నిండా /” అని సభ్య ప్రపంచపు ముసుగులో దాగిన కాముకులతో నిండిన ఈ పురుష ప్రపంచాన్ని వర్ణిస్తుంది .

                                ఇక కథా ప్రపంచంలోకి వెళ్తే ప్రశ్నిస్తే , విష వలయం , శిలలోని జల ఈనాటి పరిస్థితులకు అడ్డం పట్టే కథలు . ప్రశ్నిస్తే కథలో  శ్రీనివాస్ , సింధు రెండు కీలక మైన పాత్రలు , శ్రీనివాస్  ఒక ఉద్యమ  నాయకుడు . విప్లవోద్యమంలో ఒక నాయకుడిగా ఎదిగి , ప్రభుత్వ కాల్పుల్లో మరణిస్తాడు . ప్రజలందరూ అతని మరణానికి స్పందిస్తూ అన్యాయంగా   అన్యాయంగా ప్రభుత్వ కాల్పుల్లో మరణించిన వీరునిగా అభినందనలు , జోహార్లు తెలుపు తారు . రచయిత త్రిపురనేని  గోపీచంద్ “ ఎందుకు ?” అని ప్రశ్న వెయ్యడం నేర్పినందుకు తన తండ్రికి  కృతజ్ఞతలు తెలుపుతారు . ఇక సింధు గృహ హింసలో మరిణించిన ఒక గృహిణి అనుక్షణం అనుమానించే భర్త  పెట్టే  హింసను భరించలేక భరించలేక ఆత్మ హత్య చేసికొంటుంది .  శ్రీనివాస్ మరణిస్తే అతణ్ణి అమర వీరునిగా కీర్తించిన ప్రజలు సింధు మరణాన్ని గురించి పట్టించుకోరు . కేవలం  ఆత్మ హత్యగా  ఒకే సంఘటన స్త్రీ పట్ల జరిగితే సంఘం వివరిస్తుంది . ఈ కథను పి . రాజ్య లక్ష్మి గారు శక్తి వంతంగా  చిత్రీకరిస్తారు .

      మరొక కథ శిలలోని జల . ఇది వి . శాంతి ప్రబోధ గారి కథ . అత్యాచారానికి ఒక వయో భేదం లేదు . అయిదేళ్ళ  పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ల ముసలమ్మళ వరకు ఎవరిపైనైనా , ఎక్కడైనా ఈ హింస జరుగుతునే  వున్నది . అత్యాచారానికి గురైనపుడు  ఆ చిన్న పిల్ల మనసులో ముద్రించుకుపోయిన ఆ భయానక సంఘటన తాలుకా హింస ఒక పీడకలలా భయపెడుతుంది . నిద్ర పట్టదు . ఆనాటి భయంకర దృశ్యాలు ఇంకా కళ్లల్లో మెదలుతూ  ఆ పసి జీవితం భయపడడం , ఆ భయంకర సంఘటన తాలూకా చేదుతనాన్ని  మన హృదయం చెమ్మగిల్లేలా  వర్ణిస్తారు రచయిత్రి . 

   రచయిత్రి కవిని “ విషవలయం” కథ పురుషాధిక్యం  గల కౌషిక్  అనే భర్త దుర్మార్గాన్ని వివరించిన కథ. కౌషిక్ ఒక సగటు భారతీయ పురుషుడు .  పురుషా హంకారం మూర్తీ భావించిన వాడు . భార్య   తాను చెప్పినట్లు వినేలా , కాలికింద చెప్పులా వుండాలను  కొంటాడు . విపరీతమైన అనుమానం భార్యను  శారీరకంగా , మానసికంగా ఎన్ని విధాలుగా హింసించాలి  అన్ని విధాలుగా హింసించిన వాడు  ఆఖరికి భార్యను ఇంట్లో నుంచి వెళ్లి పొమ్మంటాడు . కానీ భార్య పద్మ భర్తను ఎదిరించి “ ఈ ఇల్లు నీది మాత్రమే కాదు . ఈ ఇల్లు నాది అని భర్తనే బయటకు వెళ్లి పొమ్మంటుంది . మొత్తానికి ఈ సంకలనంలోని కథల్లోని పాత్రలు పరిస్థితులకు కుంగిపోవు , ఎదిరిస్తాయి . గొప్ప ఆత్మ గౌరవంతో నిలబడతాయి .

    ఇంక వ్యాసాల గురించి చెప్పుకొంటే “ భూమి చెపితే ఆకాశం నమ్మదా  “ అని  వాకపల్లి బాధితుల గురించి మల్లీశ్వరీ వ్యాసం , ఎదురు చూపులూ- ఎండమావులు  అనిశెట్టి రజిత వ్యాసం రాజ్య హింస బాధిత స్త్రీలకు దక్కని న్యాయం – రత్నమాల వ్యాసం అత్యాచారం ఆచారమై పోతుందా – కృష్ణా బాయి వ్యాసం , స్త్రీలపై  అత్యాచారాల నిరోధానికి ఉపాధ్యాయ ఉద్యమాలు  ఉధృతం కావాలి . కాత్యాయనీ విద్మహే వ్యాసం , భయంతో కాదు నిర్భయంగా – భండారు విజయ వ్యాసం చదవదగినవి .

     స్పందించే హృదయమున్న వారు , స్త్రీల సమస్యల పట్ల సానుభూతి వున్నా వారి తప్పక చదవదగినది ఈ పుస్తకం .

– మందరపు హైమవతి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“~~~

పుస్తక సమీక్షలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో