ఆదివారం ఆగస్టు 27వ తారీఖున 11 గంటలకు మలక్పేట్ లో బ్రహ్మానందనగర్ లో ప్రోలాప్రగడ రాజ్యలక్ష్మి గారి స్వగృహంలో ఆవిడ పుస్తకం అనుభవాలు-జ్ఞాపకాలు పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సెంటర్ యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్ సర్రాజు గారు ఎంతో అంతరార్ధం ఉన్న నవల అని,ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయని అన్నారు.తెలుగు డిపార్ట్మెంట్
అరుణ గారు కూడా అనుభవాలు జ్ఞాపకాలు గురించి ఈ తరం వారు చదవాల్సిన పుస్తకం అన్నారు.రచయిత్రి యలమర్తి అనూరాధ ఎన్నో తరాల సంగతులు
వీరి సాహిత్యం వలన తెలుసుకోగలుతున్నామని అన్నారు.
శీలా సుభద్ర,ప్రోలాప్రగడ జనార్దన్ రావు,ప్రోలాప్రగడ సత్యన్నారాయణ,డాక్టర్. సంగీతరావు,వెంపటి కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
-యలమర్తి అనూరాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~