మట్టిగా మారి
మొక్కలా నిన్ను నాటుకున్న.
పూలలో అందంగా కనిపిస్తావని.
రోజూ పూసే
పలకరింపులు మధురమైన
తేనె ధారలు కురిపిస్తావని!
మత్తుగా కురిసిన
మెత్తని జ్ఞాపకాలు
మనసు కుదుళ్లను తడుపుతాయని
ఉదయంలా నిత్యం నవ్వులు
నలువెచ్చని కిరణాలతో
మది గడపను తాకుతాయని.
ఎదురుగా లేకపోయేనా
ఎద మీటిన కవితాల్లో
భావావేశం మనసు ఆకలి తీర్చుతుందని
-శ్రీ సాహితి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~