ఈ సృష్టిలో
ఎంతమంది భార్యలు పోలేదు
మరెంతమంది భర్తలు
కాలం చెయ్యలేదు
ముత్తాటి పండ్లు తిన్న
ముసలి దంపతులు కూడా
ఏడుకట్ల సవారీ ఎక్కాల్సిందే
ఏడేడు లోకాలకు ఎల్లిపోవాల్సిందే
చితిమీద దేహం
చింత నిప్పుల కర్రల మీద బూడిదవుతుంది
చింత మాత్రం
జీవితాంతం వెంటాడుతుందని
మా కాటి కాపరి తాత
కథలు కథలుగా చెప్పే వాడు
వయసులో పిల్ల వెనక పడ్డట్టు
ఏదో ఒక రోజు
మృత్యువు వెనకాల పడకతప్పదు
వెదురుబద్ద వేణువవుతుంది
వెంటాడే ప్రాణమవుతుంది
ఆ వృద్ధ దంపతులు
ఒకరిని విడిచి
మరొకరు వుండలేక
ప్రాయోపవేశం చేశారు
పార్ధివ దేహాలకు
పరమార్థం కల్పించుకున్నారు
ఈ దాంపత్య ధర్మoలో
పండుటాకుల్లా రాలిపోవాలని
పక్షుల్లా నేలకు కూలిపోవాలని
అమాయకులైన
ఆలు మగలు అనుకుంటారు
ఏ చుక్క ఎప్పుడు అదృశ్యమవుతుందో
ఏ ఆకాశం చెప్పదు
ఏ చిలుకా నోరు విప్పదు
వల్లరి:తీగ-లత
(దివంగత సహచరి హేమలత ఆలోచనల్లో అల్లుకున్న కవిత)
– ఎండ్లూరి సుధాకర్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మీ ఆలు మగల బంధం
దాంపత్య ధర్మం కు అద్దo పడుతుంది మీ ‘హేమ వల్లరి’
హేమ వల్లరికి సలాం..
మాష్టారు నమస్సులు.మీకు ధన్యవాదాలు.
మీరు వ్రాసే కవిత్వం ఎప్పుడూ నాకు
పంపిస్తారు .
అనుభూతితో కవి కవిత్వం వ్రాస్తే దాని వాసన, తూకం శాశ్వితం . మీరు ప్రస్తుతం వ్రాసిన కవిత్వం అదే .
మనస్సుకు చాల బాధ .మోయలేని భారం .
కాని కవిత్వం శాశ్వితం . కవిత్వం చదివేక మనసారా ఊపిరి పీల్చుతాం . తెలియకుండా విడిచిపెడతాం .
వ్రాయండి మాష్టారు . మిమ్మల్ని నేను మనః పూర్వకంగా అభిమానిస్తూ , నమస్సులు తెలియజేస్తు ….మీ ఖండాపు మన్మథరావు ,పి.బి. సిద్ధార్థ కళాశాల ,విజయవాడ.
నమస్కారం మాష్టారూ !
ఆధునిక కవులలో , సాహిత్య విమర్శకులలో
పేరెన్నికగన్నవారు మీరు .
మీ కవిత్వం తేలికైన మాటలతో ,అందరికీ అర్థమౌతుంది.
మంచి కవిత్వం విన్నాం , చదివాం అనే సంతృప్తిని కలుగజేస్తుంది మీరు వ్రాసే కవిత్వం .
మాష్టారు మరి కొద్దిగా వ్రాస్తే బాగుండేది అనిపించే సంఘటనలు ఉన్నాయి. మంచి పదార్థం మరికొద్దిగా పెడితే బాగుండేది అన్నట్లు.
మీరు వ్రాసే కవిత్వం నాపై అభిమానంతో నాకు పంపిస్తున్నందుకు మీకు సర్వధా కృతజ్ఞున్ని .ధన్యవాదాలు. నమస్సులు మాష్టారు . వ్రాయండి .
అనుభూతితో వ్రాసే కవిత్వం శాశ్వితం . మీరు వ్రాసే కవిత్వం అదే.
Super sir
ప్రియ సుధాకర్ సోదర! ఏంటీ? మా సిస్టర్ హేమలత ప్రభువునందు నిద్రించిందా? ఎప్పుడు?
I am very sorry brother. నాకస్సలు తెలియదన. I am really sorry
ప్రార్ధనా శక్తి పత్రికలో లేవను కధల్న రాసేటప్పుడు తానుా రాస్తుండేది.
ఎంత చక్కగ రాసేదో! నాకు బాగా గుర్తుంది తన పేరు పుట్ల హేమలత మనషే
అద్భుతం గాఏ చుక్క ఎప్పుడు అదృశ్యమవుతుందో ఏ ఆకాశం చెప్పదని మృత్యువాస్తవికతను స్మృతి కవిత ద్వారా విప్పి చెప్పారు ఎండ్లూరి సుధాకర్సార్👌💐💐
మాననిగాయానికిఓదర్పేమందు .
Chala hrudyanga Undi…
స్మృతి కవిత…కనురెప్పల్ని మెలిపెట్టేలా ఉంది సార్. ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి ఎక్కడికో నిర్జీవ స్థాన చలనం తప్పదు. అయినా దాని గురించి చాలా బాగా చెప్పారు