ఆఫ్ఘనిస్తాన్ లో చివురిస్తున్న మహిళాభ్యుదయం-గబ్బిట దుర్గాప్రసాద్

23 మిలియన్ల జనాభా తో 23 ఏళ్ళ యుద్ధం తో , , ఏడేళ్ల కరువుకాటకాలతో ,అయిదేళ్ల తాలిబన్ నిరంకుశ పాలనలో అణగదొక్కబడిన ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో అతి నిరుపేద దేశమైపోయింది . ఇక్కడ స్త్రీ జీవితకాల రేటు చాలా ఎక్కువ కానీ విద్యలోమాత్రం వీరు అతి తక్కువ స్థాయిలో ఉన్నారు. ఆర్ధిక ,సాంఘిక రాజకీయాలలో మాత్రం తమపాత్ర బాగానే పోషించారు 1964లో రాజ్యాంగ రచనకు తోడ్పడ్డారు . 1970నాటికి పార్లమెంట్ లో ముగ్గురు మహిళలు స్థానం సాధించారు 1990కి మహిళలు టీచర్స్ డాక్టర్లు ,ప్రొఫెసర్లు ,ప్రభుత్వోద్యోగులు లాయర్లు జర్నలిస్ట్ లు కవులు రచయిత్రులు అయ్యారు.

తాలిబన్ ల పాలన లో మహిళాహక్కులను అణగదొక్కేశారు.విద్యా వైద్య స్త్రీ శిశు సంక్షేమ సేవా కేంద్రాలలో వారికి ప్రవేశం కల్గించలేదు .ఈకాలం లో మూడుశాతం మంది బాలికలు మాత్రమే ప్రాధమిక విద్య నేర్చినట్లు గణాంకాలు తెలియ జేశాయి స్త్రీలకూ ఉద్యోగ హక్కు కూడా నిరాకరించటం తో అప్పటిదాకా ఎక్కువ శాతం మహిళా టీచర్లే ఉండటం వలన బాలుర విద్యకూ విఘాతం కలిగింది . అతి తక్కువస్థాయి ఆరోగ్యం, పోషకాహారం లేకపోవటం తో గర్భిణీ స్త్రీలు నరకాన్ని అనుభవించారు తాలిబన్ ల సిద్ధాంతాలు కూడా స్త్రీ స్వాతoత్ర్యంకి విఘాతం కలిగించాయి .ఆడవాళ్లు ప్రయాణం చేయాలంటే మగ తోడు ఉండాలనే నియమం ఉండేది . 2001లో తాలిబన్లు మహిళలు కార్లు నడుపరాదనిచట్టం తెచ్చారు .దీనితో కొద్దోగొప్పో ఉన్న స్త్రీ స్వాతంత్రం పూర్తిగా హరించుకు పోయి వంటింటికే పరిమితమవ్వాల్సిన దుస్థితి పట్టింది .సమాజం లో తోటి స్త్రీతో మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది .మహిళ బయట కనిపిస్తే క్రూర రాక్షసులులాగా తాలిబన్ లు వారిపై విరుచుకుపడి లాఠీలతోబాది చిత్ర హింసలు పెట్టేవాళ్ళు .దీనితో మహిళకు రాజకీయ సాంఘిక సేవలో అవకాశమే లేకుండాపోయింది .

2001 కి ముందు ఐక్యరాజ్య సమితి హ్యూమానిటేరియన్ కో ఆర్డినేటర్ తరచుగా ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించి మహిళాసమస్యలను అధ్యయనం చేసి తగిన సాయం అందించేవారు . 2001 లో ఆఫ్ఘనిస్తాన్ తమ దేశపు స్త్రీల అభ్యుదయం కోసం ముందుకు వచ్చి అంతర్జాతీయ సమితి తో చర్చలు జరిపింది .ఇన్ని రకాల ఒత్తిడులు ,అణచివేత ,దాడులు దమనకాండలతో ఛిద్రమైన మహిళల బతుకులలో ఇప్పుడిప్పుడే అభ్యుదయ పచ్చదనం చిగురించి వారివదానాలలో చిరునవ్వు హసిస్తోంది

యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలలో మహిళకు పురుషులతో సమానంగా స్థానం కల్పించటానికి చర్యలు చేబట్టే దిశలో కృషి చేయవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది . 52 ఏళ్ళక్రితం యూనిసెఫ్ ఇక్కడ మొదటి సారిగా ఆఫీస్ ఏర్పరచింది .. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ముఖ్యంగా మహిళల అభ్యుదయం మొదలైన వన్నీ ఆ సంస్థ కున్న అనుబంధ వ్యవస్థల పర్య వేక్షణలో ఉన్నాయి . జెండర్ ఇస్స్యూస్ ,అడ్వాంస్ మెంట్ ఆఫ్ వుమెన్ కు చెందిన జనరల్ సెక్రెటరీ ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించి మహిళల బాలికల వివక్షత సమస్యలను చర్చించి మహిళా సాధికార ప్రతినిధినిఇక్కడ ఏర్పాటు చేయాలనీ సూచించాడు. .దీనితర్వాత యు యెన్ హెడ్ క్వార్ట్రర్స్ లో మొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ మిషన్ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది .మూడు ఎక్సిక్యూటివ్ కమిటీలు ఏర్పడి తరచూ సంప్రదింపులు జరుపుతూ రాజకీయ పునర్వ్యవస్తీకరణ ,మానవ హక్కులపరిరక్షణ ,ఆఫ్ఘనిస్తాన్ పునరుద్ధరణ కోసం చర్యలు చేబట్టింది “The participation of Afghan women as full and equal partners with men is essential for the reconstruction and development of their country.” అని అభిప్రాయపడింది

తాలిబన్ల పాలన కాలం లోనే బేకరీలు నడపటం లో స్త్రీలకూ అవకాశం ఇప్పించింది .యూనిసెఫ్ పిల్లకు సామూహిక పోలియో చుక్కల ప్రోగ్రామ్ చేబట్టింది .పిల్లలకు పొంగు మసూచికం రాకుండా వాక్సిన్ ను పెద్ద ఎత్తున వేయించింది .ప్రపంచ ఆరోగ్య సంస్థ వేలాది మెడికల్ కిట్ లను అందించింది .ఆఫ్ఘన్ శరణార్ధుల రక్షణకూడా చేబట్టింది .ప్రపంచ బాంక్ ద్వారా కావలసిన ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది .
ఆఫ్ఘనిస్తాన్ మహిళా సమాజాలు ముందుకు వచ్చి క్రియాశీలకంగా పని చేస్తున్నాయి .మహిళలకు దేశీయంగా అంతర్జాతీయంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు .చర్చా వేదికలు సెమినార్లు జరుపుటపు వారిలో చైతన్యం కలిగిస్తున్నారు .ఎన్నో ఏళ్ళ తర్వాత మహిళలకు ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలలో ఉద్యోగాలు లభిస్తున్నాయి .యుని వర్సిటీ విద్య అందుబాటులోకి వచ్చింది టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లుగా రేడియో ,టెలివిజన్ లలో మహిళలు రాణిస్తున్నారు .

సమైక్య ఆఫ్ఘన్ మహిళా సంఘాల సంస్థ కోరికమేరకు బ్రస్సెల్స్ లో ఆఫ్ఘన్ ఉమెన్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ నిర్వహించింది .అనేక మతాల ,కులాల కు చెందిన 40 మంది మహిలళా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు .ఈ సమ్మిట్ ”Brussels Proclamation, which included concrete demands for the recovery of Afghan society in the areas of education, media and culture; health; human rights and the constitution; and refugees and internally displaced women. Participants of the Summit met with members of the European Parliament, members of the U.S. Congress, members of the Securit”అనే ఒక తీర్మానాన్ని ఆమోదించింది .అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ”ఈ నాటి ఆఫ్ఘన్ మహిళ-వాస్తవాలు అవకాశాలు ”అంశంపై మహిళా సదస్సు నిర్వహించారు
ఇలా మహిళాభ్యుదయం ఆఫ్ఘనిస్తాన్ లో చివురులు వేస్తోంది .అది మొక్కై మానై ఎదిగి పుష్ప ఫలభరితమై మహిళా సాధికారతకు చిహ్నమవ్వాలని ఆశిద్దాం .

                                                                                                                   – గబ్బిట దుర్గా ప్రసాద్

————————————————————————————————————————–~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో