కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్ధిక, రాజకీయ నేపథ్యం

IMG_2790”ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా, సరిచెయ్యవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరివల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూలపరికరాలు. ముడిపదార్థం జీవితం”.

– ఈ వాక్యాలను రాసింది మానవజీవితాన్ని బహుముఖంగా పరిశీలించి ఆ ముడి పదార్ధంతో ఎన్నో అద్భుతమైన కథలను, నవలలను, నాటికలను, గల్పికలను, మలిచిన అక్షరశిల్పి కొడవటిగంటి కుటుంబరావుగారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

1908-80 సంవత్సరాలు మధ్యగల సుమారు 72 సంవత్సరాల జీవితకాలంలో 1931-80 మధ్యగల సుమారు అర్ధశతాబ్ధి సాహిత్య జీవితకాలంలో – కుటుంబరావుగారు సమకాలీన ప్రజాజీవితాన్ని కుదిపేసిన ఎన్నో సంఘటనలకు వ్యక్తిగా, రచయితగా ప్రతిస్పందించాడు. భారతదేశ ఆర్ధిక, సాంఘిక, రాజకీయ చరిత్రపై బలమైన ముద్రను వేసిన ఎన్నో సంఘటనలకు ఆయన ప్రత్యక్షసాక్షి. రెండు ప్రపంచయుద్ధాలు, ఆర్ధిక మాంద్యం, జాతీయోద్యమం, స్వాతంత్య్రసాధన, దేశవిభజన, కాంగ్రెస్‌ పరిపాలన, నిరాశనే మిగిల్చిన స్వాతంత్య్రం, మతోన్మాదం, కులతత్వం, పెరిగిన దారిద్య్రం- నిరుద్యోగం, అపహాస్యంగా మిగిలిన ప్రజాస్వామ్యం, రష్యాలో జరిగిన విప్లవం రేకెత్తించిన కొత్త ఆలోచనలు, ఆదర్శాలు – వీటన్నింటి ప్రభావమూ వ్యక్తిగా, రచయితగా కుటుంబరావుగారిపై ఉంది. ఈ నేపథ్యంలోంచి కొ.కు. సాహితీ ప్రస్థానాన్ని అవగతం చేసుకోవలసి ఉంది.
సంప్రదాయ నీతులను వ్యతిరేకించినా, మూఢనమ్మకాలను ఎద్దేవా చేసినా, స్వాతంత్య్రానంతరం గద్దెనెక్కిన ప్రభువులపాలనను హేళనచేసినా, సమసమాజ స్థాపనకై పరితపించినా, రచయితగా కుటుంబరావు ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ”అన్నింటికన్నా కష్టసాధ్యమైనది జీవిత వాస్తవికత. వాస్తవ జీవితం వేరు, జీవిత వాస్తవికత వేరు. వాస్తవజీవితం అందరికీ అనుభవంలోనికి వచ్చేదే”.
”మానవజాతి ఎటుపోతున్నది ? ఎటు పోవాలి ? దారిద్య్రము, అనారోగ్యము, సంకుచితత్వము, కులతత్వము, మతతత్వము, ఇటువంటి సాంఘికపీడలు నిర్మూలనమై ప్రజలు స్వేచ్ఛగా తమ ఆర్ధిక, నైతిక జీవితాలను గట్టిపునాది మీద నిర్మించుకొనడానికి మార్గమేది? యిటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న కొద్దీ కథలు జీవితానికి సన్నిహితంగా వచ్చి జీవితసత్యాలను తెలుసుకోగలుగుతాయి”.
– అని ప్రకటించిన కుటుంబరావుగారు ఏ భావజాల ప్రభావంతో ఏ రచన చేసినా ఈ ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించేందుకే పరితపించారు.

1931 సంవత్సరంలో కథకుడుగా కుటుంబరావు కలంపట్టేనాటికి చింతాదీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చలం, వేలూరి శివరామశాస్త్రి, కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, పూడిపెద్ది వెంకట రమణయ్య, వఝుల బాబూరావు, రాయసం వెంకట శివుడు ప్రభృతులు కథలు రాస్తున్నారు. గురజాడవారి ‘దిద్దుబాటు’ కథ వచ్చి రెండు థాబ్దాలు దాటింది. కొ.కు. గారికి కథలురాయాలనే కోరిక కొడవటిగంటి వెంకట సుబ్బయ్య ‘సుకుమారి’, ‘ఏప్రిల్‌ ఫూల్‌’, – చింతాదీక్షితులు ‘సాహితికి కథ’ వంటివి చదివాక బాగా కలిగినప్పటికీ- కథకుడుగా తొలినాళ్ళలో ఆయనకు మార్గనిర్దేశకత్వం చేసింది గురజాడ, చలం అని చెప్పాలి. వీరద్దరిలో గురజాడ ప్రభావం చివరిదాకా ఉన్నప్పటికీ – చలం ప్రభావం మాత్రం ఆయన తొలినాటి కథల్లో గణనీయంగా కనబడుతుంది.

కుటుంబరావు తాను రచించిన ‘చెడిపోయిన మనిషి’ కథలో లేడీడాక్టర్‌ నోట చెప్పించినట్టు ”మనిషి నుండి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము, తక్కువ అపకారము జరిగేటట్లు చూచుకొనడమే సరి అయిన ప్రవర్తన. మిగిలినవి బూటకపు నియమాలు” అనేదే ఆయన ఆలోచన. ఈ పనిని సాధించేక్రమంలో ‘ఎదుటివారు, ప్రక్కవారు, ఏమనుకుంటారు అనికాకుండా నీ మనసు ఏం చెబుతున్నది అనే విషయానికి’ ప్రాధాన్యతను యివ్వాలని చలం కోరుకున్నట్టుగా – రసెల్‌ కోరు కున్నట్లుగా,- కొడవటిగంటివారు కూడా కోరుకున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతత్త్వవేత్త రసెల్‌ రెండు తరహాల ‘మంచిపనులు’ వుంటాయి అని అంటాడు.  ఈ రెండింటిలో వ్యక్తి అనుసరించాల్సింది ‘సబ్జెక్టివ్‌ రైట్‌నెస్‌’ అని చెప్పిన నేరానికి – సమకాలీన సమాజం రసెల్‌ వంటి గొప్పమేధావిని దారుణమైన అవమానాలకు గురిచేసింది. ”మనిషి పాపం చేసినా ఫరవాలేదు. మానవత్వం వదులుకోకూడదు” అని చెప్పిన నేరానికి (యిక్కడ ‘పాపం’ అనే మాటను చర్చి చెప్పే మూఢనమ్మకాలకు, తిరోగమన ధోరణులకు, వర్తించేదిగా అర్ధం చేసుకోవాలి) అతడిపై ఆస్తికులు, సంప్రదాయవాదులు కత్తిగట్టారు.

సంప్రదాయనీతులను, పురుషాధిక్య సమాజంలోని రెండునాల్కల ధోరణిని, నిరసించి వ్యక్తిస్వేచ్ఛకు పట్టాభిషేకం చేసిన చలంగారిలో కూడా ఇలాంటి తిరుగుబాటు ధోరణే ఉన్నది. కుటుంబరావుగారిని యిది బాగా ఆకట్టుకుంది.
కుటుంబరావుగారి ‘అపనమ్మకం’ కథలోని రాజ్యం – ”నాకు నిజంగానే నీతి నమ్మకం లేదు. నీతికంటే ముఖ్యమైనవి జీవితంలో ఉన్నట్లు అదివరకే నిర్ధారణ చేసుకున్నాను. ఇక, ఆత్మగౌరవము, పవిత్రత అంటావా? దీర్ఘంగా ఆలోచిస్తే అవి అణచిపెట్టిన అహంకారాతి శయాలేగాని, ఇంకేమీకాదు” అనడాన్ని – ‘పెళ్ళి వ్యవహారం’ కథలోని సులోచన తన స్నేహితురాలు అన్న జగన్నాధంతో వివాహం లాంటి ‘ఒప్పందం’ కుదుర్చుకున్న వ్యవహారాన్ని – ”పాప ఫలం” కథలోని పంకజాక్షి పంకంలోంచి బయటపడిన తీరును, ”సద్యోగం” కథలోని సూర్యనారాయణ నీతిని పట్టుకుని వేళ్లాడి నిరుద్యోగిగా ఉండిపోవడం కంటే తన ‘పురుష లక్షణానికి’ తగిన (?) వ్యాపకాన్ని సంపాదించుకుని బ్రతుకుతెరువును వెదుక్కోవడాన్నీ, కుహనా నీతులతో ‘అరణ్యం’లా మారిపోయిన ఈ సమాజంలోంచి బ్రతికిబయటపడడానికి ‘అరణ్యం’ కథలోని వివాహిత చేసిన తెగింపును, గమనిస్తే చలం ప్రభావంతో సమకాలీన సమాజాన్ని దుఃఖమయం చేసిన సంప్రదాయనీతులపై కుటుంబరావు ఎగరేసిన తిరుగుబాటు బావుటా తెలుస్తుంది.

అయితే – చలాన్ని కుటుంబరావు ఏనాడూ గుడ్డిగా అనుసరించలేదు. చలంలో వుండే మితిమీరిన వ్యక్తివాద ధోరణిగానీ, వివాహవ్యవస్థ పట్ల విముఖతగానీ, కుటుంబ రావు కథల్లో సార్వత్రిక రీతిలో కనబడవు. అదిన్నీగాక – చలంగారి పాత్రల్లా కొ.కు. కథల్లోని పాత్రలు లౌకిక దృక్పథం లేనివికావు. లౌక్యం పండిన పాత్రలవి. సంప్రదాయంతో అవి ఢీకొనేవి – కేవలం ‘నిజమైన’ ఆనందాన్ని సాధించడానికీ, తమను తాము అన్వేషించు కోడానికీ కాదు. లౌకికంగా ఏ ప్రమాణాలతో చూసినా హాయిగా సుఖపడడానికీ – బ్రతుకు తెరువును సాధించుకోడానికీ అవి సంప్రదాయంపై తిరుగుబాటు చేస్తాయి. ఇందుకు కావలసిన తెగువ, గడుసుదనం,ఆయన స్త్రీ పాత్రల్లో మరింతగా కనబడుతుంది. వ్యక్తి చేసే తిరుగుబాటును లౌకికదృష్టితో అవలోకించినందువల్లనే ఆయన కాలక్రమంలో ఆ గీతను పొడిగించి సామాజిక అభ్యున్నతికి దానినొక మార్గంగా చూడగలిగారనిపిస్తుంది.

ఇక, – ”సెక్సు అనేది ఒక సున్నితమైన విషయం. అది ఒక సహజమైన ప్రవాహంలా సానుభూతి, ఉదారత, వెచ్చని తాదాత్మ్యతలతో కూడిన ధారావాహికలా ఉండాలి. హృదయంలేని లైంగిక సంయోగంలా ఉండకూడదు. ఏదో ఒక తాత్కాలిక ఆవేశంతో తొందరలో అయిపోయే వ్యవహారంలా ఉండకూడదు” అనే డి.హెచ్‌. లారెన్స్‌ భావాలకు చలంగారిలా కుటుంబరావు సన్నిహితుడు కాదు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ మధ్య ఒక సావనీర్‌ వ్యాసంలో (కొడవటి గంటి సాహిత్య సమాలోచన – ఢిల్లీ ఆంధ్రంసంఘం) నండూరి రామమోహనరావు గారు చేసిన వ్యాఖ్యలు మనోవీధిలో మెదులుతున్నాయి.
”చలం తన ప్రపంచానికి కేంద్రంలో స్త్రీని నిలబెట్టాడు. స్త్రీ స్వాతంత్య్రం ముఖ్యంగా సెక్స్‌ స్వాతంత్య్రం దృష్టి నుంచి సకల సామాజిక సమస్యలనూ పరిశీలించాడు. కథారచనలో ఒకవిధంగా ఆయన వారసుడు కొడవటిగంటి. కాని చలం ప్రారంభించిన భావ విప్లవాన్ని ఈయన విశ్వతోముఖంగా విస్తరింపజేశాడు. మార్కి ్సస్టు సామాజిక దృక్పథాన్ని సంపూర్ణంగా స్వీకరించాడు. ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణలోని సంకుచితత్వాన్ని నిరాకరించి ఆ ప్రక్రియను మానవుని సామాజిక వ్యక్తిత్వావగాహనకు వర్తింపజేశాడు. మానవుడి ఆర్ధిక,రాజకీయ, లైంగిక తదితర సమస్యా సామస్త్యాన్ని తన సాహిత్య వస్తువుగా 2526 సంపాదించుకుని బ్రతుకుతెరువును వెదుక్కోవడాన్నీ, కుహనా నీతులతో ‘అరణ్యం’లా మారిపోయిన ఈ సమాజంలోంచి బ్రతికిబయటపడడానికి ‘అరణ్యం’ కథలోని వివాహిత చేసిన తెగింపును, గమనిస్తే చలం ప్రభావంతో సమకాలీన సమాజాన్ని దుఃఖమయం చేసిన సంప్రదాయనీతులపై కుటుంబరావు ఎగరేసిన తిరుగుబాటు బావుటా తెలుస్తుంది.
అయితే – చలాన్ని కుటుంబరావు ఏనాడూ గుడ్డిగా అనుసరించలేదు. చలంలో వుండే మితిమీరిన వ్యక్తివాద ధోరణిగానీ, వివాహవ్యవస్థ పట్ల విముఖతగానీ, కుటుంబ రావు కథల్లో సార్వత్రిక రీతిలో కనబడవు. అదిన్నీగాక – చలంగారి పాత్రల్లా కొ.కు. కథల్లోని పాత్రలు లౌకిక దృక్పథం లేనివికావు. లౌక్యం పండిన పాత్రలవి. సంప్రదాయంతో అవి ఢీకొనేవి – కేవలం ‘నిజమైన’ ఆనందాన్ని సాధించడానికీ, తమను తాము అన్వేషించు కోడానికీ కాదు. లౌకికంగా ఏ ప్రమాణాలతో చూసినా హాయిగా సుఖపడడానికీ – బ్రతుకు తెరువును సాధించుకోడానికీ అవి సంప్రదాయంపై తిరుగుబాటు చేస్తాయి. ఇందుకు కావలసిన తెగువ, గడుసుదనం,ఆయన స్త్రీ పాత్రల్లో మరింతగా కనబడుతుంది. వ్యక్తి చేసే తిరుగుబాటును లౌకికదృష్టితో అవలోకించినందువల్లనే ఆయన కాలక్రమంలో ఆ గీతను పొడిగించి సామాజిక అభ్యున్నతికి దానినొక మార్గంగా చూడగలిగారనిపిస్తుంది.
చలం ప్రారంభించిన భావ విప్లవాన్ని ఈయన విశ్వతోముఖంగా విస్తరింపజేశాడు. మార్కి ్సస్టు సామాజిక దృక్పథాన్ని సంపూర్ణంగా స్వీకరించాడు. ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణలోని సంకుచితత్వాన్ని నిరాకరించి ఆ ప్రక్రియను మానవుని సామాజిక వ్యక్తిత్వావగాహనకు వర్తింపజేశాడు. మానవుడి ఆర్ధిక,రాజకీయ, లైంగిక తదితర సమస్యా సామస్త్యాన్ని తన సాహిత్య వస్తువుగా తీసుకుని హేతువాద దృక్పథం నుండి నిశితంగా, నిర్దాక్షిణ్యంగా విశ్లేషిస్తూ రచనలు సాగించాడు -” అంటారాయన ఆ వ్యాసంలో.
ఇందులో నండూరి వారు ప్రస్తావించిన ‘ఫ్రాయిడ్‌’కు సంబంధించిన అంశాన్ని కూడా (సంక్షిప్తంగా నయినా) అవలోకించవలసి వుంది. ఇరవయ్యవ శతాబ్దంలో మానవుని ఆలోచనలను అత్యంతం ప్రభావితం చేసిన మేధావుల జాబితాను చెప్పవలసి వస్తే – అందులో ఫ్రాయిడ్‌ పేరు కూడా ప్రముఖంగా కనబడుతుంది. ఒకప్పుడు ఛార్లెస్‌ డార్విన్‌ సిద్ధాంతం చేసిన అలజడికి మించిన అలజడిని సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ‘సైకో ఎనాలిసిస్‌’ సిద్ధాంతం సృష్టించింది. దీని ప్రభావం పలురంగాలపై పడినట్టుగానే సాహితీ సృజనపై కూడా పడింది. పాత్ర చిత్రణలో క్రొత్తపుంతలు తొక్కేందుకు రచయితలకు వీలు చిక్కింది.

దీని ప్రభావం కొ.కు. కథలపై కూడా కొంతవరకూ కనబడుతుందిగాని, కొందరు రచయితల్లా – ఈ సిద్ధాంతాల అవగాహనతో ప్రయోగాత్మకమైన రీతిలో కథలురాసి ప్రత్యేకతను చూపుదామనే తపన కుటుంబరావుగారికి లేదు. ఆయన దృష్టి అంతా ‘జీవిత వాస్తవికత’ను అన్వేషించడం మీదనే ! ఇందుకుగాను ఈ అవగాహన ఎంతవరకూ తోడ్పడగలదో అంతవరకే దానిని ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు కుటుంబరావు గారి ‘అమాయకురాలు’ కథనే తీసుకుందాం. ఒక కథను మనోవైజ్ఞానిక దృక్పథంలోంచి చెప్పబడిన కథగా పేర్కొనేందుకు కావలసిన లక్షణాలన్నీ ఈ కథలో వున్నాయి. కానీ – ఈ కథను చెప్పడంలో కథకుడి లక్ష్యం అంతటితో ఆగిపోదు.
ఈ కథలోని భ్రమరకు యుక్తవయస్సు వచ్చిన తొలిరోజుల్లోనే వైధవ్యం సంప్రాప్తించి నప్పుడు సంప్రదాయాన్ని కాదని జుట్టు తీసుకోడానికి నిరాకరించడానికీ, ఆ తర్వాత ఇంటిలో వాళ్ళు వద్దంటున్నా తనకు తానుగా జుట్టు తీసుకోవడానికీ గల కారణాన్ని ఆమె అంతరంగపు లోలోపలి పొరల్లో వెదికి పట్టుకోవలసి ఉంటుంది. వెంకటేశ్వర్లు పట్ల ఆమె గుండెల్లో కోరిక గూడుకట్టుకుని వున్నందునే మొదటిలో ఆమె జుట్టు తీయించు కోడానికి అంగీకరించలేదు. చివరకు వెంకటేశ్వర్లుకు మరొక అమ్మాయితో వివాహం జరుగుతున్నప్పుడు అందమైన తన కురులను భీభత్సదాయకమైన రీతిలో కత్తిరించుకుని ‘మెసోకిక్‌’ ప్రవర్తన ద్వారా అంతరంగంలోని తన కోరికకు, – ఉపశమనం కలిగించు కోవలసి వచ్చింది.

ఈ కథలో భ్రమర అంతరంగంలోని సంఘర్షణ మాత్రమే కాదు, – ఆమెలాంటి బాల వితంతువులు ఆనాటి సమాజంలో ఎదుర్కోవలసివున్న సామాజిక సమస్యకూడా ఆవిష్కరించబడడం విశేషం. – యిదే విషయాన్ని ‘కాలప్రవాహపు పాయలు’ కథ విషయంలో కూడా చెప్పవచ్చు. ఈ కథలోని పురుషోత్తం ఒకప్పుడు సోషలిస్టు. మార్క్‌ ్స, లెనిన్‌ రచనలపట్ల వల్లమాలిన అభిమానాన్ని చూపినవాడు. సంఘాన్ని మరమ్మత్తు చేసి, పేదల బ్రతుకులు బాగుచెయ్యాలని పరితపించినవాడు. అయితే – చిత్రమైన విషయం ఏమిటంటే – అతని గుండెలోపల వున్న అసలు పురుషోత్తం అతడికి మానసిక సంక్షోభం కలిగిస్తూ ఉంటాడు. అతడి ఒకనాటి ప్రియురాలినీ, అతడు ఒకనాడు నమ్మిన ఆదర్శాలనూ, జ్ఞాపకానికి తెచ్చి చికాకును కలిగిస్తూ ఉంటాడు. వీటన్నింటి ఫలితంగా అతడు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెప్పే ”ఆడిటరీ హెల్యూసినేషన్స్‌”కు, – ”విజువల్‌ హెల్యూసినేషన్స్‌”కు గురి అవుతూ ఉంటాడు. ఇట్లాంటి ఒక ఉదంతాన్ని ఈ కథలో కుటుంబరావుగారు మనసుకు హత్తుకునేలా చెబుతారు. అవకాశవాద రాజకీయాలు ఇవ్వగల స్వల్పకాల ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ – దానివలన వ్యక్తికి మనశ్శాంతి కరువుకాక తప్పదని హెచ్చరించే కథ యిది.

 ఇలాంటి ఉదాహరణలు కొ.కు. కథల్లో మరికొన్ని కూడా కనబడతాయి. కొందరు కథకుల్లా లైంగికప్రవృత్తి, అంతరంగంలో అణచివేయబడిన శృంగారభావనలు వంటి కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా – మనిషి కథను పలుడైమెన్షన్లలో చూపేందుకు మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాల అవగాహనను సమర్దవంతంగా ఉపయో గించుకున్న కథకుడు కుటుంబరావు.

ఈ విషయానికి సంబంధించిన చర్చ అలా ఉంచి, కుటుంబరావుగారిపై గల ఇతర ప్రభావాల గురించి చెప్పేటప్పుడు జార్జి బెర్నార్డ్‌షా, హెచ్‌జి వెల్స్‌, అనటోల్‌ఫ్రాన్స్‌, మొదలైనవారి పేర్లు మనోవీధిలో మెదులుతాయి.
రచనలో సామాజిక ప్రయోజనానికి పెద్దపీటవేసిన బెర్నార్డ్‌షా నాటకాల్లో భావావేశపరులైన హీరోలు, హీరోయిన్లు కనబడతారు. వ్యంగ్యం, హాస్యం వీటన్నింటితో తాను చెప్పదలిచిన విషయాన్ని పాఠకుడి బుర్రకు గట్టిగా పట్టేలా చెబుతాడాయన. ఈ వ్యంగ్యస్ఫూర్తి కుటుంబరావుగారికి చాలా అభిమానపాత్రమైన విషయం.
నిరాడంబరమైన శైలిలో ఉండే ఆయన రచనలకు ఈ వ్యంగ్యస్ఫూర్తే ఒక ప్రత్యేకతను సమకూర్చి పెట్టిందంటే అందులో అతిశయోక్తి లేదు. ప్రేమకథను రాసినా, వర్గపోరాటం గురించి చెప్పినా, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి పెళ్ళికథను రాసినా, ఆఖరికి సినీ ‘మాయాలోకం’ గురించి రాసినా, ఆయన కథలన్నింటిలోనూ ఈ వ్యంగ్యస్ఫూర్తి తళుక్కుమంటూనే ఉంటుంది. ఏ విషయాన్నయినా ఘాటయిన పదజాలంతో విమర్శించకుండా – చురుక్కుమనిపించే వ్యంగ్యంతో చెప్పడం ఆయన ప్రత్యేకత. తన జీవితకాలంలో ఆయనకు చికాకు కలిగించిన చౌకబారు సినిమాలను, – తాడు, బొంగరం లేని ‘సైన్స్‌ఫిక్షన్‌’నూ – అధమస్థాయి అభిరుచిని పెంపొందించే డిటెక్టివ్‌ సాహిత్యాన్ని, – ఇట్లాంటి సాహిత్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకునే వ్యాపార రచయితలనూ, – కుటుంబరావుగారు తమ కథల్లో ఆటపట్టించిన తీరు ఆయన రచనలు చదివినవారందరికీ గుర్తుంటుంది.

వ్యంగ్యరచనా చమత్కృతిలో కొందరు కుటుంబరావుగారిని ప్రఖ్యాత రష్యన్‌ రచయిత చెహోవ్‌తో పోలుస్తూ ఉంటారు. చెహోవ్‌ లాగానే కుటుంబరావుగారికి కూడా పాఠకులను గిలిగింతలు పెట్టడం ప్రధానధ్యేయం కాదు. సరి అయిన రీతిలో ప్రశ్నను పాఠకుడి ముందు ఉంచి అతడిని ఆలోచింపచెయ్యడమే ఇద్దరికీ ఇష్టమైన విషయం. ”ఉపదేశం వ్యక్తిత్వాన్ని పరాభవిస్తుంది. ఆలోచనను రేకెత్తించే గుణం వ్యక్తిత్వాన్ని నిద్రలేపుతుంది-” అనే కుటుంబరావుగారి సాహితీ దృక్పథం చెహోవ్‌ ఆలోచనకు సన్నిహితమైందే.

అంతేకాదు – ”కథారచయితగా చెహోవ్‌ ఇతివృత్తం మీదా, ఏదో ఒక ఆశ్చర్య దాయకమైన విషయం మీద కాక – మొత్తం వాతావరణం మీదా – ఒక సంఘటన ప్రాతిపదికగా జీవితానుభూతినంతటినీ పట్టుకోగలగడం మీద ఆధారపడతాడు” అంటూ చెహోవ్‌ గురించి ‘మార్టిన్‌ సేమూర్‌-స్మిత్‌’ చేసిన విశ్లేషణ (గైడ్‌ టు మోడరన్‌ వరల్డ్‌ లిటరేచర్‌’ అనే గ్రంథంలో) కుటుంబరావుగారికి కూడా చాలా వరకు వర్తిస్తుంది.

 వ్యంగ్యాన్ని అభిమానించే కుటుంబరావుగారు ఒక సందర్భంలో ఇలా అన్నారు. ”నన్నడిగితే కసికొద్దీ, మంటకొద్దీ రాసేది నాకు బాగుంటుంది. కసి అంటే పళ్ళు కొరకడమూ, చిందులు తొక్కడమూ, అనుకోనక్కరలేదు. ఆ కసి వీరేశలింగం గారి రచనల్లో ఉన్నట్టే ఉండనవసరం లేదు. ‘కన్యాశుల్కం’లో ఉన్నట్లు కూడా ఉండవచ్చును. చలంగారి కథల్లో కసి ఉంది. ఆయనలో సౌందర్య తృష్ట ఒక పాలు తగ్గి, కసి ఇంకో పాలు పెరిగితే ఇంకా బాగుండునేమో అనిపిస్తుంది. రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి కథల్లో ఉన్నదా కసి. భమిడిపాటి వారి హస్యంలో పళ్ళు పటపటలాడించే కసి ఉండేది. సెటైరంతా కసి సాహిత్యమే”
(సాహిత్య వ్యాసాలు – పే 313)

 ఇలాంటి ‘కసి’తోనే కుటుంబరావుగారు తన కథాసాహితీ ప్రస్థానంలో అన్ని థలలోనూ రచనలు చేస్తూ వచ్చారు. రాసిన ప్రతిసందర్భంలోనూ సంఘటనల ప్రాతిపదికగా మొత్తం జీవితానుభూతినీ, వాతావరణాన్నీ సమర్ధవంతంగా పట్టుకున్నారు. ”నేను మామూలుగా బుద్ధిమంతుణ్ణే” (రాజకీయ వ్యాసాలు – పే 366) అని చెప్పుకున్న కుటుంబరావుగారు ఏప్రిల్‌ 1931లో ‘గృహలక్ష్మి’లో ‘ప్రాణాధికం’ అనే మొదటి కథను రాసేనాటికి తెలుగుసాహిత్యానికి మరో ‘బుద్ధిమంతుడయిన’ రచయిత వచ్చాడని పెద్దలు భావించారు, – ఆ పత్రిక సంపాదకులు ఆండ్ర శేషగిరిరావుగారు ఈ కథకొక ప్రస్తావికను రాస్తూ – ”భారతమహిళ శీలవిషయమున అగ్నిశిఖ. నియమ పాలనమున వజ్రభిత్తి, – భర్తృ సేవ ఆమెకు ప్రాణాధికము. ఈ విషయమునే ఈ కథ నిర్వహించుచున్నది. ఇది భారతమహిళా సతీత్వమును ప్రదర్శించు చక్కని చిన్నకథ” – అని మెచ్చుకున్నారు కూడా.
కాని, మరో ఆరేళ్ళు గడిచేసరికి ”తాతయ్య”, ”అరణ్యం”, ”కాలభైరవుడు” లాంటి కథలు రాసి, ఆ ‘బుద్ధిమంతతనాన్ని’ చాలావరకూ పోగొట్టుకున్నాడు ! కుసంస్కారి అయిన ముసలిమొగుడితో సంసారం చెయ్యలేక సవతికొడుకుతో వెళ్ళిపోయిన ఓ అభాగ్యురాలి కథను ”అరణ్యం”లోను, ఒక ఊరకుక్కను కాలభైరవుడి అవతారంగా భావించి పూజాదికాలు, భజన సంకీర్తనలు, మొక్కుబడులు, వగైరా కార్యక్రమాలన్నీ జరిపించి ఖంగుతిన్న మూడభక్తుల కథను ”కాలభైరవుడు”లోనూ – రాసి విమర్శకులకు చికాకు కలిగించాడు ! బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం అనే విమర్శకుడు ‘కాలభైరవుడు’ కథను విమర్శిస్తూ ‘ఈ కథ ఎందుకు వ్రాసినట్లో తెలియడం లేదు’ అని విసుక్కున్నాడు కూడా, – అంతటితో ఆగకుండా ‘రావణుడికి న్యాయం చేస్తాను’ అని బయలుదేరి ‘అశోకవనం’ అనే కథను రాసి సీతను ‘బొత్తిగా సౌందర్య దృష్టిలేని వ్యక్తి’గా చిత్రిస్తే – విమర్శకులు ఇది ‘రావణుడికి న్యాయం చెయ్యడం కాదు. సీతకి అన్యాయం చెయ్యడం’ అంటూ గుండెలు బాదుకోవలసి వచ్చింది ! –
ఇక – కుటుంబరావుగారు ఆ రోజుల్లో రాసిన కథల్లో తనకు బాగా తృప్తి కలిగించిన కథ అని చెప్పుకున్న ‘తాతయ్య’ కథ సంప్రదాయవాదులకు మరింత ‘బాధ’ కలిగించింది.

”మనుషులందరిలోకీ బ్రాహ్మలెక్కువ. బ్రాహ్మల్లో నియోగులకంటే వైదీకులెక్కువ. బ్రాహ్మణ పిల్లలు శూద్ధర వాళ్ళ ఇండ్లలో మంచినీళ్ళు కూడా తాగకూడదు. అందులో ఒక మజ్జిగచుక్క వేస్తే తాగవచ్చు. నియోగులు మంచిబ్రాహ్మణులు కారు. కాని, వాళ్ళను శూద్దర వాళ్ళను చూచినట్లు చూడరాదు. నీళ్ళల్లో మజ్జిగ చుక్క వెయ్యమని అడగకూడదు! మాలవాళ్ళ దగ్గరగా పోతే మనం మైలపడతాం. దొరలు కూడా మాలవాళ్ళే – వాళ్ళు స్నానాలు చెయ్యక పోయినా తెల్లగా ఉంటారు.ఇంటిదగ్గర కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. వాళ్ళు గొప్పవాళ్ళు!” – ఇలా, ఒక బాలుడి స్వగతాన్ని కుహనా విలువలతో నిండిన సంప్రదాయభావాల పట్ల ‘కసి’తో – మనముందు ఉంచుతారు కుటుంబరావుగారు’తాతయ్య’ కథలో. ఇలాంటి చురకలు ‘కొంతమందికి’ ఆగ్రహాన్ని తెప్పించడంలో ఆశ్చర్యం ఏముంది?

సుమారుగా ’40ల వరకూ సామాజిక సమస్యలపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చిన కుటుంబరావుగారి ఆలోచనల్లో ’40ల తర్వాత చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. దీనికి కారణం సామ్యవాద దృక్పథంతో పరిచయం ఏర్పడడం, ఒకప్పుడు చలిగిదీలిరీ లాంటి అర్ధశాస్త్రవేత్తలు – It is an Obsolete economic text book which i know to be not only scientifically erroneous but with out interst or application for the modern world అని భావించిన కారల్‌మార్క్‌ ్స ‘డాస్‌ కాపిటల్‌’లో కుటుంబరావుగారికి గొప్ప వెలుగు కనబడింది. (ఆర్ధికమాంద్యం సమయంలో మరణశయ్యమీద కెక్కిన పెట్టుబడిదారీ వ్యవస్థను బ్రతికించి – సోవియట్‌ రష్యా ఒరవడిలో ప్రపంచం ‘ఎర్రబడి పోకుండా’ ‘రక్షించిన’ కీన్స్‌ వంటి అర్ధశాస్త్రవేత్తలకు మార్క్స్‌ ఆలోచనలు రుచించకపోవడంలో ఆశ్చర్యం లేనట్టే – పీడితుల పక్షాన నిలబడాలని కోరుకునే కొ.కు. వంటివారికి మార్క్‌ ్స దృక్పథం ఆకట్టుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు).

‘-1942లో మార్క్‌ ్స రాసిన ‘కేపిటల్‌’ చదివిందాకా నాకు కమ్యూనిజం యొక్క ఆధారమేమిటో తెలియలేదు. ఒక మిత్రుడు యథాలాపంగా అన్నమాట నామీద బండెడు ప్రభావంకన్నా ఎక్కువ పనిచేసింది. దొరికిన మార్కి ్సస్టు సాహిత్యం చదివాను. భవిష్యత్తు మార్కి ్సజంకే ఉన్నట్లు నమ్మకం కుదరింది”.
– (”రాజకీయ వ్యాసాలు” నుండి-)

”మార్క్స్‌ ‘కేపిటల్‌’ చదవడంతో సహా మార్కి ్సజం గురించి చదవడం నాకు మేలు చేసింది. సంఘవ్యాధి గురించి కొంత అర్థం చేసుకోగలిగాను. ఈపాటి జ్ఞానోదయం కలగగానే నేనుచేసిన మొదటిరచన ‘కులంగాడి అంత్యక్రియలు’,- అటు తర్వాత రాసిన కథల్లో మనస్తత్వం గురించి గాలికబుర్లు రాయడం మానేసి ఆ మనస్తత్వాన్ని ఆడించే సాంఘిక శక్తులను చిత్రించడం ప్రారంభించాను. ‘నీ కథలు వెనుక ఉన్నట్లుగా లేవు. అవే బాగున్నాయి’ అని కొందరు అభిమానులు నన్ను హెచ్చరించారు”
(‘సాహిత్య వ్యాసాలు’ నుండి)
– అంటూ కుటుంబరావుగారూ వ్యక్తిగా, రచయితగా తనపై మార్క్‌ ్స ఆలోచనలు చూపిన ప్రభావాన్ని చెప్పుకున్నారు.

కుటుంబరావుగారు ఏ ఆలోచనలతో కథలను రాసినా, దాని ఆవిష్కరణకుమధ్యతరగతి కుటుంబీకుల జీవితచిత్రాన్నే నేపథ్యంగా తీసుకునేవారనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరి మనస్తత్వాన్ని, ప్రవర్తనను చిత్రించడంలో కుటుంబరావుగారికి గొప్ప నిపుణత ఉంది. మార్క్సిస్టు దృక్పథంతో రచనలు చేసినప్పుడు కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తూ కుటుంబరావుగారు ఇలా అన్నారు. ”- నేను మధ్యతరగతి సంస్కారం కలవాణ్ణి. ఈ సంస్కారంతో నేను అభ్యుదయ రచనలు చేయగలను కానీ, – శ్రామిక సాహిత్యసృష్టి చెయ్యలేను. అందుచేత నా రచనలు జనసామాన్యాన్నీ, శ్రామికులను, ఉత్తేజపరచలేవు. కాని, మధ్యతరగతి వారిలో ప్రజాజీవితానికి అనుకూలించే పరివర్తన తెచ్చే అవకాశం ఉంది. ఈ పని ఎంత విజయ వంతంగా చెయ్యగలిగితే అంత ఉత్తమ కథకుణ్ణి అనిపించుకుంటాను” – ఇలా అంటూనే – ”రచయిత తన వర్గాన్ని గురించే రాయాలని లేదు. అనేకమంది సుప్రసిద్ధ కథకులు తమకు దూరంగా ఉండేవర్గాలను గురించి కూడా కథలు రాసి ఆయా జీవితాల్లోని సత్యాన్ని ప్రదర్శించగలిగారు -” అని కూడా అంగీకరించారు.

రచయిత తాను ఏ వర్గానికి చెందినవాడో ఆ వర్గాన్ని గురించి రాసినప్పుడు జీవిత సత్యాన్ని మరింత స్పష్టంగా పట్టుకునేందుకు – దానిని శక్తివంతంగా కథల్లో ఆవిష్కరిం చేందుకు అవకాశం ఉంటుంది. అలాకాని పక్షంలో తాను ఏ వర్గాన్ని గురించి రాస్తున్నాడో ఆ వర్గంతో కొంత సన్నిహిత సంబంధం ఉండాలి. కేవలం ఊహించుకుని జీవితసత్యాన్ని అన్వేషించగలగడం సాధ్యంకాదు. మరొకవర్గానికి చెందిన రచయితకు శ్రామికుల జీవితాలతో సన్నిహిత సంబంధం ఉన్న సందర్భాలలో కూడా ఎంతకాదనకున్నా తన వర్గస్వభావం రచనలో చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది.ఇది చెబుతుంటే – మార్కి ్సస్టు సాహిత్యవిమర్శ గురించి చెబుతూ లూనకార్‌స్కీ-”- రచయిత సృష్టించే సాహిత్యం ఉద్దేశపూర్వకంగానయితేనేమి, అట్లాంటిది లేకుండా నయితేనేమి, అతడు ప్రాతినిధ్యం వహించేవర్గానికి ఎప్పుడూ ప్రతిబింబంగా ఉంటుంది. అలాకానప్పుడు సర్వసాధారణంగా జరిగేదేమంటే – రచయితపై వివిధవర్గాల ప్రభావం జమిలిగా ఆ సాహిత్యంలో కనబడుతుంది. దీనిని చాలా జాగ్రత్తగా పరిశీలించ వలసి ఉంటుంది-” అనడం జ్ఞాపకానికి వస్తుంది.

ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్న, ’40ల తర్వాత కొ.కు. రాసిన కథల్లో – స్వాతంత్య్రానంతరం దేశంలో పెచ్చుపెరిగిన దారిద్య్రం, నిరుద్యోగం, కమ్యూనిజమ్‌ను అణచివేసే విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చూపించిన శ్రద్ధ ఆకలి దారిద్య్రాలను తగ్గించడం విషయంలో చూపకపోవడం, కులంపేరుతో మతంపేరుతో పెరిగిన దోపీడీ ప్రవృత్తి, మొదలయిన విషయాలను సార్వత్రిక ధోరణిలో చర్చిస్తూ – మధ్యతరగతి కుటుంబాల్లో పలురూపాల్లో చోటుచేసుకునే ‘జంకు’లు వారినెలా శక్తి హీనులను చేస్తున్నాయో, చిన్నపాటి సంపద లభించే అవకాశం ఏర్పడినా మధ్యతరగతి కుటుంబాల్లో కూడా పెట్టుబడిదారీ ప్రవృత్తి ఎలా తలెత్తుతుందో – అద్భుతంగా చిత్రించడం జరిగింది అనేది విస్మరించరాని సత్యం. ఇందుకుగాను ఆయన వ్యంగ్యాన్ని చిలకరిస్తూ ”కసి” సాహిత్యాన్ని రాయవచ్చు. లేదా ‘సింబాలిక్‌’ ధోరణిలో కథను అల్లవచ్చు. లేదా – మామూలుగానే కథను చెబుతూ మనుషుల ప్రవర్తనలోని సంకుచితత్వాన్ని ఎద్దేవా చేయవచ్చు. అదీకాదనుకుంటే ఒక ‘సైన్స్‌ఫిక్షన్‌’గా మన ముందు ఉంచవచ్చు. ఏ ధోరణిలో ఎలా రాసినా ఆయన ఆరాటం మనిషి మనిషిగా జీవించాలని మాత్రమే !

”రోడ్డు ప్రక్కన శవం” కథలో కుటుంబరావుగారు ”-మనిషి ఫాలాకక్షుడు. ఫాలం విప్పి ఏ సమస్యకేసి చూసినా ఆ సమస్య యొక్క స్వరూపం మారిపోతుంది. అయితే – తాను ఫాలాకక్షుణ్ణన్న సంగతి మనిషికి తెలియదు. అందుచేత ఫాలం విప్పడు. శివోహం అనుకోడు -” అని వ్రాశారు. పాఠకులచేత ‘శివోహం’ అనిపించేలా చెయ్యాలన్నదే కొ.కు. తపన !

తాను నమ్మిన విషయాన్ని ఆచరించే విషయంలో వున్న ‘జంకు’ వ్యక్తికీ, దేశానికీ, మంచిదికాదు అనేది కుటుంబరావుగారి అభిప్రాయం. ఈ విషయాన్నే మనం ‘యావజ్జీవ శిక్ష’, ‘బకాసుర’ వంటి కథల్లో చూడవచ్చు. ఈ రెండూ ’60లలో వ్రాయబడిన కథలే – (‘బకాసుర’ను నవలగా భావించడం వున్నదిగాని, ఒక ప్రక్రియలగా చెప్పాల్సి వచ్చినప్పుడు అది కథే అని నా అభిప్రాయం)

‘యావజ్జీవశిక్ష’ లోని శేషు ఒక ఆదర్శవాది.హేతువాది. అతగాడికి జంఝెప్పోగు మీద, బ్రాహ్మణత్వంమీద, పరలోకం మీద బొత్తిగా నమ్మకం లేదు. కాని, బ్రతుకుతెరువుకోసం – అదెమ్మత్త ఆదరణను పొందడం కోసం – ఈ బూటకపు విలువలన్నింటికీ తలవంచవలసి వచ్చింది. ఆఖరికి తద్దినాలు కూడా పెట్టవలసి వచ్చింది. ”నేను ఎంత వాజెమ్మనో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది” అనే శేషు స్వగతంతో ఈ కథను ముగిస్తారు కుటుంబరావుగారు. ఇట్లాంటి ”రాజీ”లు మధ్యతరగతి కుటుంబీకుల జీవితాల్లో కోకొల్లలుగా కనబడతాయి. వీరిలోని – ‘జంకు’ ఈ పరిస్థితికి మూలకారణం. ఈ ‘జంకు’ వల్లనే పెట్టుబడిదారు కూడా స్వేచ్ఛగా ప్రజలను దోచుకోగలుగుతున్నాడు అనే విషయాన్ని ‘బకాసుర’లో అత్యద్భుతంగా చెబుతారు కుటుంబరావుగారు. ఈ కథలో భీముడు చంపిన బకాసురుడు (రాక్షసుడు) నిజానికి – భయంకరుడేమీ కాదు ! వంట్లో జవసత్వాలు లేకపోయినా (వార్దక్యం కారణం వల్ల) తన ఏజంట్ల పబ్లిసిటీ ద్వారా ”రాక్షసత్వాన్ని” నిలబెట్టుకుంటూ ప్రజల్ని హడలకొడుతున్న ముసలి రాక్షసుడు ! – ప్రజల అజ్ఞానమే – ప్రజల పిరికితనమే – అతడి శక్తి. ”కేపిటలిజమ్‌”కు ఉన్న ముద్దు పేర్లన్నింటికీ ఇతడు బదులు పలుకుతాడని చెప్పవచ్చు.

ఈ కథలోని భీముడు మరో ప్రపంచపు మరో లెనిన్‌ అనుకున్నప్పటికీ, ఇంతకు మించి గుర్తుపెట్టుకోదగిన పాత్రలు ఈ కథలో ఉన్నాయి. అవి – బలభద్రుడు, వేదాంతి, బండివాడు. ‘బకాసుర వ్యవస్థ’కు బలియైపోయిన బలభద్రుడి మరణంలో త్యాగం ఉంటే – ముసలి రాక్షసుడి సంగతి తెలిసీ, రాజుగారి క్రౌర్యాన్ని స్వయంగా చవిచూసీ, బ్రతుకు తెరువుకు తలవంచి రోజుకో ప్రాణాన్ని బకాసురుడికి అప్పజెప్పిన బండివాడిలో బానిసత్వపు పిరికిదనం ఉంది. యిక – వేదాంతి గారిలో తిరోగతమనతత్వానికి ఊపిరి అయిన అవకాశవాదం ఉంది ! భీముని అవతారానికి ముందు ప్రతి ‘బకాసుర వ్యవస్థ’ లోనూ ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే ! ”బకాసురుణ్ణి భయపెట్టగలిగిన వాడినై ఉండి కూడా వాణ్ణి చూచి హడలిపోయే మంత్రి వగైరాలకు తాను లొంగవలసి వచ్చింది” అని బండివాడనుకున్న మాటలనేపథ్యంలోంచి ఈ కథను చదివే పాఠకులు ఆత్మపరిశీలన చేసుకొనవలసి ఉంది.
‘జాంబవంతుని కల’లో కూడా ఇలాంటి ‘సింబాలిక్‌’ ధోరణి కనబడుతుంది. ఈ కథలోని జాంబవంతుడు ఓ వానర ప్రభువు కొలువుకూటంలోని మంత్రి మాత్రమే కాదు.

ప్రజల అభ్యుదయం కోసం ఆరాటపడిన ఓ మహనీయుడు. కిష్కింధ ప్రజలకు వాలి పాలనపోయి సుగ్రీవుడి పరిపాలన వస్తే దేశం స్వేచ్ఛా, సమానతలతో అభివృద్ధి చెందుతుందనీ, ప్రజలకు హాయి కలుగుతుందని ఆయన కలలు గన్నాడు. కానీ, – సుగ్రీవుడి పాలనలో ఆ కలలేవీ నిజం కాకపోవడమేకాకుండా – దేశంలో రాక్షస రాజ్యం విజృంభించడం చూసి కృంగిపోయాడు. ఋష్యమూకం మీద ఉన్న విప్లవకారులు దేశానికి మంచి చేద్దామనే పట్టుదలతో ఉన్నారని విని – వాళ్ళమీద ఆశలు పెంచు కున్నాడు. దర్బారులో ”విప్లవం వర్ధిల్లాలి” అని కలవరించి ఉద్యోగం ఊడగొట్టు కున్నాడు. ఈ కథ చదివినప్పుడు మనదేశంలో ప్రజల కలలు కల్లలుగా మారిన స్వాతంత్య్రానంతర పరిస్థితులు మాత్రమేకాదు – అవకాశవాదులతో సహజీవనం చెయ్యలేక, ఆత్మను చంపుకోలేక కాంగ్రెస్‌ నుండి బయటకు వచ్చిన కొందరు వృద్ధ నాయకులు కూడా జ్ఞాపకానికి రావడం సహజం. ఈ కథలో భీముడు చంపిన బకాసురుడు (రాక్షసుడు) నిజానికి – భయంకరుడేమీ కాదు ! వంట్లో జవసత్వాలు లేకపోయినా (వార్దక్యం కారణం వల్ల) తన ఏజంట్ల పబ్లిసిటీ ద్వారా ”రాక్షసత్వాన్ని” నిలబెట్టుకుంటూ ప్రజల్ని హడలకొడుతున్న ముసలి రాక్షసుడు ! – ప్రజల అజ్ఞానమే – ప్రజల పిరికితనమే – అతడి శక్తి. ”కేపిటలిజమ్‌”కు ఉన్న ముద్దు పేర్లన్నింటికీ ఇతడు బదులు పలుకుతాడని చెప్పవచ్చు.

ఈ కథలోని భీముడు మరో ప్రపంచపు మరో లెనిన్‌ అనుకున్నప్పటికీ, ఇంతకు మించి గుర్తుపెట్టుకోదగిన పాత్రలు ఈ కథలో ఉన్నాయి. అవి – బలభద్రుడు, వేదాంతి, బండివాడు. ‘బకాసుర వ్యవస్థ’కు బలియైపోయిన బలభద్రుడి మరణంలో త్యాగం ఉంటే – ముసలి రాక్షసుడి సంగతి తెలిసీ, రాజుగారి క్రౌర్యాన్ని స్వయంగా చవిచూసీ, బ్రతుకు తెరువుకు తలవంచి రోజుకో ప్రాణాన్ని బకాసురుడికి అప్పజెప్పిన బండివాడిలో బానిసత్వపు పిరికిదనం ఉంది. యిక – వేదాంతి గారిలో తిరోగతమనతత్వానికి ఊపిరి అయిన అవకాశవాదం ఉంది ! భీముని అవతారానికి ముందు ప్రతి ‘బకాసుర వ్యవస్థ’ లోనూ ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే ! ”బకాసురుణ్ణి భయపెట్టగలిగిన వాడినై ఉండి కూడా వాణ్ణి చూచి హడలిపోయే మంత్రి వగైరాలకు తాను లొంగవలసి వచ్చింది” అని బండివాడనుకున్న మాటలనేపథ్యంలోంచి ఈ కథను చదివే పాఠకులు ఆత్మపరిశీలన చేసుకొనవలసి ఉంది.
‘జాంబవంతుని కల’లో కూడా ఇలాంటి ‘సింబాలిక్‌’ ధోరణి కనబడుతుంది.

ఈ కథలోని జాంబవంతుడు ఓ వానర ప్రభువు కొలువుకూటంలోని మంత్రి మాత్రమే కాదు. ప్రజల అభ్యుదయం కోసం ఆరాటపడిన ఓ మహనీయుడు. కిష్కింధ ప్రజలకు వాలి పాలనపోయి సుగ్రీవుడి పరిపాలన వస్తే దేశం స్వేచ్ఛా, సమానతలతో అభివృద్ధి చెందుతుందనీ, ప్రజలకు హాయి కలుగుతుందని ఆయన కలలు గన్నాడు. కానీ, – సుగ్రీవుడి పాలనలో ఆ కలలేవీ నిజం కాకపోవడమేకాకుండా – దేశంలో రాక్షస రాజ్యం విజృంభించడం చూసి కృంగిపోయాడు. ఋష్యమూకం మీద ఉన్న విప్లవకారులు దేశానికి మంచి చేద్దామనే పట్టుదలతో ఉన్నారని విని – వాళ్ళమీద ఆశలు పెంచు కున్నాడు. దర్బారులో ”విప్లవం వర్ధిల్లాలి” అని కలవరించి ఉద్యోగం ఊడగొట్టు కున్నాడు. ఈ కథ చదివినప్పుడు మనదేశంలో ప్రజల కలలు కల్లలుగా మారిన స్వాతంత్య్రానంతర పరిస్థితులు మాత్రమేకాదు – అవకాశవాదులతో సహజీవనం చెయ్యలేక, ఆత్మను చంపుకోలేక కాంగ్రెస్‌ నుండి బయటకు వచ్చిన కొందరు వృద్ధ నాయకులు కూడా జ్ఞాపకానికి రావడం సహజం. స్వాతంత్య్రానంతరం మనదేశంలో అధికారం స్వార్థపరుల హస్తగతం కావడంతో దేశం ‘దిబ్బరాజ్యం’గా మారిపోయిందని భావించిన కుటుంబరావుగారు ‘దిబ్బరాజ్యం’ కథలు రాశారు.

దిబ్బరాజ్యానికి స్వాతంత్య్రం వచ్చిందని విని మనకు కథను చెప్పే వ్యక్తి ఆ రాజుగారిని కలుసుకోవడానికి అక్కడకు వెళ్ళేసరికి రాజుగారి దర్బారు ‘శాసనసభ’గా పేరుమార్చుకుందనీ, దానికి రాజావారు అధ్యకక్షులయిపోయారనీ, జమీందారులందరూ మంత్రులుగా మారిపోయారనీ తెలుస్తుంది! – రాజుగారు మాటల మధ్యలో తమ దేశంలో జమీందారీలు రద్దయిపోయాయని చెబితే – మన కథానాయకుడు చాలా సంతోషించి, ఆ వివరాలు చెప్పమంటాడు.
”-జమీందారీలు లేవుగానీ, ఒక్కటే చింత, – జమీందార్లకు నష్టపరిహారం రొక్కరూపంలో ఇవ్వలేకపోయాం. పరిహారం క్రింద చాలా భూములు వారికిచ్చేసి – మిగిలిన వాటిని రైతులు నాలుగేళ్ళపాటు ఎలాంటి ప్రతిఫలం పొందకుండా సాగు చేసేటట్లు నిర్ణయించాం” అంటారు రాజుగారు ! యిక, – మరోకథలో దిరుగుండం రాజ్యాన్ని ఏలుతున్న దిబ్బరాజుగారు దేశంలో దారిద్య్రం పెరిగిపోయిందని విని దరిద్రుల పీడ వదిలించుకోడానికి వాళ్ళందరినీ ఉరితీయాలని ఆదేశిస్తారు ! దీని ఫలితంగా దేశంలో పనిచేసేవారే లేకుండా పోయారు. ధనికులకు భూమ్మీద కాళ్ళు నిలవని పరిస్థితి ఏర్పడి దేశం అల్లకల్లోలమైపోయింది. అప్పటికిగాని శ్రీశ్రీ రాజావారికి, వారి ఆశ్రితులయిన ధనికులకు, తాము ఇన్నాళ్ళు బ్రతికింది బీదల కష్టంమీదనేనని తెలిసిరాదు !

 ఇట్లాంటి కథలను కుటుంబరావుగారు ఏ వ్యవస్థపట్ల ‘కసి’తో రాశారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇలాంటి ‘కసి’తో రాసినదే ‘కరువొచ్చింది’ అనే కథ కూడా – ”-కరువొచ్చింది. పంటలుపండినై, – గింజలు కళ్లాలు దాటగానే మాయమయినై. పైరు పచ్చగా పెరిగినప్పుడూ, కంకులు బరువుగా వొంగి, తమకు ఏపుగా పెంచిన భూదేవికి జోహార్లు చేసినప్పుడూ, బంగారు గింజలు కనక వర్షంలా జలజల రాలినప్పుడూ, కళ్లపండువుగా చూచిన పేదప్రజలకు కన్నుపొడుచుకున్నా గింజ కనిపించలేదు. రైతుల తపః ఫలితాన్ని గద్దలు తన్నుకుపోయినై. కాటకం వచ్చింది” అంటూ మొదలయ్యే ఈ కథలో కరువు నివారణకు ఆకలిని తిడుతూ కవిగారు పద్యరత్నాలు రాయడమూ – కరువు నివారణకు ఏర్పాటు చేయబడిన సభలో – దేశమంతటా కరువు నివారణ హోమాలు, యజ్ఞాలు చెయ్యాలనీ, రామభజనలు చేయాలనీ, పేదప్రజలు రోజూ గీతాపారాయణం చెయ్యాలనీ – బ్రహ్మచర్యం పాటించి సంతానోత్పత్తిని తగ్గించాలనీ – పూటకు పావుశేరుకన్నా ఎక్కువబియ్యం అన్నంగా వండుకోకూడదనీ (తర్వాత దీనిని అర్థశేరుగా సవరించారు) తీర్మానాలు ఆమోదించ బడడమూ, – ఆ కథ చదివినవారికి గుర్తు ఉంటుంది. అయితే – కథ చివరకు వచ్చేసరికి, – పేదవాళ్ళందరూ ఏకం కావడంవల్ల లక్షల కొద్దీ బస్తాల ధాన్యం చీకట్లోంచి బయటకు రావడమూ, కరువు పటాపంచలు కావడమూ, జరుగు తుందనుకోండి – అది వేరే విషయం !
ఈ కథ గురించి చెబుతూ వుంటే, – బిజెపి ప్రభువుల పాలనలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన వింత ఒకటి జ్ఞాపకానికి వస్తున్నది. ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూస్తే కాస్తపెరిగింది. అప్పటికే ఫుడ్‌ కార్పొరేషన్‌ వారి గిడ్డంగుల్లో ఆరుకోట్ల టన్నులదాకా ఆహారధాన్యాలు మూలుగుతున్నాయి. ఇప్పుడు ఈ క్రొత్త దిగుబడి కూడా జత చేరితే వాటిని గిడ్డంగుల్లో నిలవ చెయ్యడానికి పెద్దమొత్తంలో వ్యయం అవుతుంది. ఏం చెయ్యాలి అనే సమస్య వచ్చింది. ఇది ఇలా ఉండగా, ఆహారధాన్యాలు ఖర్చుకాకుండా ఎందుకిలా పేరుకుపోతున్నాయి అనే సందేహం కూడా వచ్చింది.

ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా వెంటనే మన ‘మేధావులు’ కనిపెట్టారు. పేదప్రజలు ఇప్పటికే తగినంత ఆహారధాన్యాలను వినియోగం చేస్తున్నారు. అందుచేత అదనంగా వారు ఆహారధాన్యాలను వినియోగం చెయ్యడానికి ఇష్టపడడం లేదు. చేపలు, మాంసం ఇలాంటి వాటిపైన వ్యయం చెయ్యడానికీ, ఆహారేతర వస్తువుల వినియోగం చెయ్యడానికీ, మొగ్గు చూపిస్తున్నందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని వారు తేల్చిచెప్పారు! దాదాపు 50 కోట్లమంది ప్రజలు రోజుకు ఒక పూట కూడా కడుపునిండా తినడానికి నోచుకోని స్థితిలో వున్న దేశంలో – ప్రజలకు ఆహారధాన్యాలు అదనంగా అవసరంలేదని ఆ ‘మేధావులు’ ఎలా తేల్చిచెప్పారో అర్ధం కాదు ! ఇంతకన్నా విచిత్రం మరొకటి కూడా ఉంది. ఆహార సబ్సిడీపై చేస్తున్న వ్యయం బాగా ఎక్కువగా వుంటున్నది కాబట్టి – ఆహార ధాన్యాల నిల్వలపైనా, రవాణాపైనా ఉన్న నియింత్రణలన్నీ ఎత్తివేసి – వీటిని ‘సద్వినియోగం’ చేసే బాధ్యత ప్రయివేటు రంగానికి అప్పజెప్పమని మరో అర్థశాస్త్రవేత్తగారు సలహా ఇచ్చారు.

ఫుడ్‌ కార్పొరేషన్‌ గోడవున్లలో పేరుకునిపోయి వున్న నిల్వలలో ‘పనికి ఆహారం’ పథకం క్రింద అదనంగా మరికొన్ని పనులు చేబడితే పేదప్రజలకు మేలు సమకూరడం మాత్రమే కాకుండా దేశ ఆర్ధికప్రగతికి అది దోహదం చేస్తుందని ఈ ‘మేధావు’లకు తెలియదనుకోవాలా? – గిడ్డంగుల్లోని ఆహార ధాన్యాలు వినియోగం కాకపోవడానికి కారణం ప్రజలకు వినియోగశక్తి లేకపోవడం అనే కనీస అవగాహనవారికి వుండదను కోవాలా? లేక పెట్టుబడిదారీ మనస్తత్వానికి ఇది పరాకాష్ఠ అనుకోవాలా? అనే ప్రశ్నలకు సమాధానం ఆ మేధావులకే తెలియాలి !  ఇలా ఆలోచించినప్పుడు, – కొ.కు. గానీ 2002 సంవత్సరం వరకూ జీవించి వుంటే ‘కరువొచ్చింది’ కథను ఇంతకుమించిన ‘కసి’తో రాసివుండేవారేమో అనిపిస్తుంది.

పెట్టుబడిదారీ ఆర్ధికవ్యవస్థకు మూలాధారామైన విషయాల్లో ‘దోపిడీ’ అనేది ముఖ్యమైనది. ఈ ‘దోపిడీ’ అనే ప్రక్రియ అవతలి వ్యక్తికి తెలిసీ, తెలియకుండా కూడా ఎలా జరుగుతుందో – సాధారణ ప్రజాజీవితంలో యిది ఎలా ఆమోదాన్ని పొందుతుందో, కుటుంబరావుగారు ‘నువ్వులు-తెలగపిండి’, ‘ట్యూటర్‌’ అనే రెండుకథల్లో చాలా అద్భుతంగా చెబుతారు.

”తెలగపిండి ఎట్లా వస్తుందో అందరికీ తెలుసు. నువ్వులు అట్టే నాగరికతలేని సరుకు. అది పొలాల్లో కష్టజీవుల చేతిలో పెరిగి మధ్యవాళ్ళకు అమ్ముడై బస్తీ చేరుతుంది. అక్కడ దాన్ని గానుగ ఆడి నూనె తీస్తారు. ఆ నూనె అందమైన సీసాలకూ, డబ్బాలకూ, ఎక్కి అనేక వంటిళ్ళను అలంకరిస్తుంది. తెలకపిండి చక్కను నవ్వులు ఒకవేళ చూచినా పోల్చలేవు. అది గొడ్లకూ, పేదవాళ్ళకూ ఆహారం అవుతుంది” అంటూ ప్రారంభిస్తారు కొ.కు. ‘నువ్వులు – తెలగపిండి’ కథను (రచనాకాలం – 1950).

కొందరికి లాభాలను ఆర్జించి పెట్టడానికి మరికొందరు ఎలా గానుగ ఆడబడి వ్యర్థపదార్థంగా ఎలా మిగిలిపోతారో – పెట్టుబడిదారీ పారిశ్రామిక నాగరికతలో ఉత్పత్తి కారకంగా శ్రామికుడి స్థానం ఏమిటో ఒక మధ్యతరగతి కుటుంబం కథగా ఇందులో చెబుతారు కుటుంబరావుగారు.ఈ ‘నువ్వులు-తెలగపిండి’ వ్యవహారంలో గానుగ ఆడించేవాడు పారిశ్రామికవేత్త. ఆడబడేవాడు కార్మికుడు, అనే నియమం ఏదీ లేదు. దగ్గర బంధువుల విషయంలో కూడా ‘స్వార్థం’ అనేది చొరబడినప్పుడు మనుషులు నువ్వుల గానుగ ఆడబడుతూనే ఉంటారు. చివరకు తెలకపిండిలా మారి వ్యర్థపదార్థంగా మిగిలిపోతూ వుంటారు అనేదానికి ఈ కథలోని సోమయాజులు అనబడే ఇంటల్లుడే తార్కాణం. అతడికి భగవంతుడు ఇచ్చిన చక్కని గాత్రమే అతడి బ్రతుకును తెలకపిండి చక్కలామార్చేసింది.
ఇక- ‘ట్యూటర్‌’ కథలోని రాజశేఖర్‌ – ‘నువ్వులు తెలగపిండి’ కథలోని సోమ యాజులు మాదిరిగా నోట్లో నాలుకలేనివాడు కాదు. ‘దోపిడీ’ అనేది ఎలా జరుగుతుందన్న విషయంలో అవగాహన ఉన్నవాడు. ‘వాణి’ అనే ఓ ధనవంతుడి కూతురు (టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీ అధినేత కూతురు. ఓ మందుల కంపెనీ అధినేత కుమారునికి కాబోయే భార్య) అనేటట్టు – ‘చాలా నాస్టీమేన్‌. రిచ్‌క్లాస్‌ అంటేచాలా ఎన్వీ. – ఎప్పుడూ కమ్యూనిజమే మాట్లాడతాడు’.
– ఇలాంటి రాజశేఖర్‌ వాణికి కేవలం వందరూపాయలకు ట్యూషన్‌ చెప్పడానికి రోజూ ఎందుకు వాళ్ళ ఇంటికి వెడుతున్నాడు? ఓ సినిమా కంపెనీ వాళ్ళకుచాలా తక్కువ పారితోషికం అని తెలిసి కూడా తన నాటకాన్ని ఎందుకు అమ్మాడు?

”-నెస్సిసిటీ. నా బోటివాళ్ళకు నెస్సిసిటీ అనేది ఒకటి ఉంటుంది. నాకు మీ డాడీ (రాణి తండ్రి) వందరూపాయలు జీతం ఇస్తున్నారు. – ఇలాంటి ట్యూషన్స్‌ రోజుకు మూడు చెబితే నెలకు మూడువందలు వస్తాయి. డుయు థింక్‌, ఇట్‌ ఈజ్‌ ఎ డీసెంట్‌ ఇన్‌కం ? – అయితే నేను వందరూపాయలు ఎందుకు యాక్సెప్ట్‌ చేస్తున్నాను? – సెస్సిసిటీ. నేను సర్వైవ్‌ కావాలంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఒప్పుకోవాలి” అనే రాజశేఖర్‌ ఆవేదనలో ఎక్స్‌ప్లాయిటేషన్‌ జరగడానికి గల అసలు కారణం తెలుస్తుంది. దీనిని నిర్మూలించాలన్నదే ‘సోషలిజమ్‌’ ధ్యేయం.
– కుటుంబరావు కథల గురించి చెప్పేటప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కేపిటలిస్ట్‌ ప్రవృత్తులు ఎలా చోటు చేసుకుంటాయో ఆయన చెప్పే తీరు గురించి తప్పకుండా ప్రస్తావించవలసి ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులకు ఆర్ధికపరంగా ఏమాత్రం అవకాశం దొరికినా పెట్టుబడిదారీ వ్యవస్థలోని బడాబాబులను మించిన అవలక్షణాలను అతి సునాయసంగా సంతరించుకుంటారనేది కొ.కు. అభిప్రాయం. ”మారిన జీవితం”, ”అంతరాత్మ”, ”కొత్తజీవితం” మొదలైన కథలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

”మారిన జీవితం” కథలోనిలీల ఒక ఆదర్శవాది కూతురు. హెచ్చు, తగ్గులనేతేడాలు కృత్రిమంగా కల్పించబడినవేననీ, మనుషులందరూ ఒకటే అనీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు ప్రతిరోజూ ఇంటిలో ఇచ్చే ఉపన్యాసాలను ఆమె తెరుచూ వింటూండేది. అయితే – ఆమెకు డబ్బున్న పల్లెటూరి సంబంధం కుదరడంతో – తండ్రి ఇచ్చే ‘ఉపన్యాసాలు’ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. బడుగువర్గాలకు చెందిన ప్రజలను పీడించడానికి కావలసిన హంగులన్నీ సునాయాసంగా ఆమెకు సమకూరాయి. మొదట్లో అత్తింటివారు ఈమెను పరాయిపిల్ల క్రింద చూశారు గానీ, ఆమెకూ తమ తరహా ప్రవృత్తే ఉన్నదని రూఢికావడంతో ఆమెను స్వంతమనిషిగా చూడడం ప్రారంభించారు! ఒక ప్రక్క కూలిజనాన్ని (”తిండికి లేని వెధవలు”-) అణచిపెడుతూ – మరో ప్రక్కన బ్రాహ్మణులకు సంతర్పణలు చేయిస్తూ – ”పెద్దమనుషు”లకు ఉండవలసిన హంగు లన్నిటినీ సము పార్జించుకుంది. ఓ విధంగా చెప్పాలంటే ”ఐశ్వర్యం” నవలలోని డాక్టరు కూతురు వంటిదే లీల కూడా.

ఇదే విషయం ”అంతరాత్మ” కథలో మరొకవిధంగా ఆవిష్కరించబడింది. ఈ కథలోని సుదర్శనం అనే యువకుడి తండ్రి ఒక ఆదర్శవాది. వీరేశలింగం గారితో కాస్త పరిచయం ఉన్నవాడు. అయితే – అతడు చనిపోయిన తర్వాత – అతడు చేసిన 13వేల రూపాయల ఇన్సూరెన్స్‌ మొత్తానికి సుదర్శనం తల్లి ‘అధిపతి’ కావడంతో ఆమెలో తలెత్తిన ‘కేపిటలిస్ట్‌’ ప్రవృత్తిని – మున్నెన్నడూ లేనివిధంగా జ్యోతిష్యం, హస్తసాముద్రికం, అంకెలశాస్త్రం, వారాలు, వర్జ్యాలు మొదలైనవాటికి ఆ ఇంటిలో ప్రాధాన్యత లభించిన వైనాన్ని, అకారణంగా ఆ ఇంట్లోని మనుషులు ఒకరినొకరు ద్వేషించుకోవడాన్ని ఈ కథలో చాలా ఆసక్తికరమైన రీతిలో చెబుతారు కుటుంబరావుగారు.

”-నేను సమ్మెలు చూశాను. పోలీసుల లాఠీచార్జీలు చూశాను. కానీ, మా ఇంట్లో జరిగే పోట్లాటలంత అర్ధరహితమైన సంఘటనలని ఎక్కడా చూడలేదు. ఇంట్లో ఇంత తిండి వుండి బతకడం చేతకాని మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడు తప్ప ఈ కొట్లాటలను ఊహించుకోలేరు. ఇంట్లో డజనుమంది ఉంటే ఏ ఇద్దరి మధ్యనైనా శత్రుత్వం ఉండేది. ఇవాళ కొంపలో ఎవరికి ఏ ఎదురుదెబ్బ తగిలినా మిగిలిన వారంతా ఏకగ్రీవంగా నవ్వడానికి సిద్ధంగా ఉన్నారు”.అంటూ ఈ కథలోని సుదర్శనం లోనయిన ఆవేదనను పాఠకులు మరిచిపోలేరు. ‘ధనంగాడి’ లీలలకు తార్కాణాలే ఇవి అన్నీ !

కుటుంబరావుగారి ”కులంగాడి అంత్యక్రియలు” కథలో (మార్క్‌ ్స ‘కేపిటల్‌’ చదివిన తర్వాత కలిగిన అవగాహనతో తాను రాసిన తొలికథగా దీనినే కొ.కు. పేర్కొన్నారు) దిక్కులేని చావుచచ్చిన కులంగాడికథ, ఆ తర్వాత వచ్చిన అధికారం గాడికథల తర్వాత ధనంగాడి కథ కూడా వున్నది.

పరమ కర్కోకటకుడు అయిన ధనంగాడు అమలుపరిచే నిశ్శబ్ద అలిఖిత శాసనాన్ని గురించి చెబుతారు కుటుంబరావుగారు ఈ కథలో. ”వాడి మహత్యం ఏమిటోగాని వాడికోసం ప్రతీతరంలోనూ అనేక కోట్లమంది మనుషులు మనస్ఫూర్తిగా బలిఅయ్యారు. కేవలం వాడి అనుగ్రహం పొందలేకా, కోల్పోయీ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య పెద్దది” అని అంటారాయన. – ఇలాంటి ధనంగాడి ‘ఘనత’ గురించి ఎంతమంది ఎన్ని కథలురాసినా ఇంకా కొంత ‘వ్యథ’ మిగిలిపోతూనే ఉంటుంది !. గల్పికకు ఆ అవసరం లేదు. ఇందులో పాత్రచిత్రణ అనేదానికి అవకాశమే ఉండదు. గిలి గింతలు పెడుతూ, చురుక్కుమనిపించే వ్యంగ్యంతో-మన విలువలలోని లేకిదనాన్ని, చిత్తశుద్ది లేమినీ, అవకాశవాదాన్నీ, ఎద్దేవా చేస్తూ ‘సున్నితంగా’ మొట్టికాయలు మొట్టేందుకు (!) నిర్దేశించబడిన ప్రక్రియ ఇది! కథతో పోలిస్తేదీని నిడివి బాగా తక్కువేగాని – ఇంచు మించుగా కథ సాధించే ప్రయోజనాన్ని ఇదికూడా సాధించేందుకు అవకాశం ఉంది.

 ఈ విషయానికి సంబంధించిన చర్చ ఎలా ఉన్నా, ఒక విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. కుటుంబరావుగారు కథలు రాసినా, గల్పికలు రాసినా, మరేది రాసినా, అన్నింటివెనుకా ఒక లక్ష్యం ఉన్నమాట వాస్తవమేగాని – సిద్ధాంతాల ఆవిష్కరణ కోసం జీవితాన్ని ఆయన ఎన్నడూ వక్రంగా చిత్రించలేదు. అన్ని సందర్భాలలోనూ – సిద్ధాంతాల కన్నా జీవితాన్నే ఆయన ప్రమాణంగా భావించాడు.

”- రచయిత ఆగ్రహానికి బలమైన కారణం జీవితంలో ఉండాలి. జీవితంలో లేని లోపాలను సంస్కరించి పారేస్తూ రచన చేస్తే ఆ రచనకు రెండు కాళ్ళూ వుండనట్టే – జీవితంలో లేనివిషయం మీద ఆగ్రహావేశం తెచ్చుకుని రచన చేస్తే అదో సుడిగుండంగా తయారై ఊరుకొంటుంది…” అంటారాయన. ఇక – కథారచనలో శిల్పానికి అవాంఛనీయమైన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని కుటుంబరావుగారు అంగీకరించలేదుగాని – కథకు ఆయువుపట్టు అని చెప్పదగ్గ అంశాలలో శిల్పం ముఖ్యమైనది అని ఆయన పలుసందర్భాలలో చెప్పారు. అంతేకాదు – ”ఈనాటి యువకులు తమ కథల ద్వారా పరిస్థితులను మార్చాలని చూస్తున్నారు గానీ కథ యొక్క వాస్తవికత శిల్పం మీద ఎంత ఆధారపడి ఉంటుందో గ్రహించడం లేదు” అని కూడా అన్నారు. నేటి కథా రచయితలు కొ.కు. చెప్పిన ఈ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొన వలసిన అవసరం ఎంతయినా ఉంది.

 కథలు రాయడం తగ్గించుకున్న తర్వాత కూడా కుటుంబరావుగారుతన సమకాలీన పరిస్థితులపై పలు సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు.’- మనదేశంలో ప్రజాస్వామ్యం ఎన్నికలతో ప్రారంభమై అక్కడే ఆగిపోతున్నది’
”- మనం తలక్రిందులుగా నిలబడి వ్యవసాయం అనే పునాది లేకుండా పారిశ్రామికంగా పైకి రావాలని చూస్తున్నాం”.
”- ఈనాటి ప్రపంచ రాజకీయాలను సంక్షోభంలోకి నెడుతున్న అంశాలలో ఒకటి ఆహారధాన్యాలు, రెండోది పెట్రోలు. తిండిగింజలు అమెరికా పాలకుల చేతిలో ఒక అస్త్రం లాంటిది. ఒక వంక ఆహారసమస్య ప్రపంచ సమస్య అయి కూర్చున్నా కూడా అమెరికా ఆహారాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించే ఆలోచన కట్టిపెట్టలేదు”. ”…తలసరి రాబడిలో అయిదుశాతం కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా తిండిపోతులుగా పౌరులు జీవించే అవకాశం ఉన్న దేశాలలో సైతం ఆహారపదార్థాలకు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చే స్థితిలో ఉండగా – మనదేశంలో లక్షలాది ప్రజలకు ఆదాయం కడుపునిండా తినడానికే చాలడం లేదు”
(‘రాజకీయ వ్యాసాల’ నుండి)

వివిధ సందర్భాలలో ’70లలో కుటుంబరావుగారు రాసిన వ్యాసాల్లోని కొన్ని వ్యాఖ్యలు ఇవి. కాలగమనంలో కొన్నిమార్పులు, చేర్పులూ, ఏర్పడినా ఈనాటికీ ఈ వ్యాఖ్యలు చాలావరకు వర్తిస్తాయి.
ఒకప్పుడు – కుటుంబరావుగారు ”గ్రహశకలం” అనే ‘సైన్స్‌ఫిక్షన్‌’ కథలో చీకటి ప్రపంచంలోని వెలుగుకు, వెలుతురు ప్రాంతంలోని చీకటికి, మధ్యజరిగే సంఘర్షణ గురించి రాశారు. ‘చీకటి’ అనేదానిని పెట్టుబడిదారీ వ్యవస్థ స్వరూపానికి – ‘వెలుగు’ అనేదానిని సామ్యవాద వ్యవస్థకు, ప్రతీకలుగా తీసుకుంటే ఒకనాటి రష్యా, అమెరికా, విధానాలకు సంబంధించిన సంఘర్షణగా దీనిని చెప్పుకోవచ్చు.

కాని, – ఇవాళ సోవియట్‌ యూనియన్‌ లేదు. రష్యాలో పెట్టుబడిదారీ ధోరణులకు చోటు దొరికింది. దీనితో సామ్యవాద ధోరణికి సంబంధించిన శకం ముగిసిపోయిందనే ‘ఆనందం’ కొందరికి లభించింది ! -‘ప్రపంచీకరణ విధానాల’ పేరుతో పెట్టుబడిదారీ దేశాలు బహిరంగంగా, నిస్సిగ్గుగా, పేదదేశాలను దోచుకోవడం మొదలుపెట్టాయి. ప్రయివేటీకరణ మంత్రం పేదదేశాలలో కొందరిని మరింత ధనికులను చేస్తే – పేదవారి పరిస్థితి మరింత దయనీయమైపోయింది. ఈ సమకాలీన చరిత్రను మూడుథాబ్దాల క్రిందటి కొ.కు. వ్యాఖ్యలలోంచి అవలోకిస్తే మనం ముళ్ళబాటలో చిక్కుపడిపోవడానికి గల కారణాలు మరింతగా అవగతం అవుతాయి.

– కొద్ది మాసాల క్రితం (2004 సం||లో) ఐక్యరాజ్యసమితి వారి మానవాభివృద్ధి నివేదిక వెలువడింది. ఈ నివేదికలో 177 దేశాలకు సంబంధించిన వివిధ మానవాభివృద్ధి అంశాలలో జరిగిన ప్రగతి ప్రాతిపదికగా ‘రేంకు’లను ఇవ్వడం జరిగింది. అందులో మన ‘రేంకు’ 127 అని ప్రకటించడం జరిగింది. అంటే – అర్ధశతాబ్ధికిపైగా ప్రణాళికలను అమలుచేస్తూ – ఆర్ధిక ప్రగతిని సాధించేస్తున్నామని డాంబికాలు పోతున్న మనం – ప్రపంచంలో (మానవాభివృద్ధి విషయంలో) అట్టడుగు స్థాయిలో వున్న 50 దేశాలలో ఒకటిగా ఉన్నాం ! – అదేవిధంగా యు.ఎన్‌.డి.పి. వారి అంచనా ప్రకారం మనదేశానికి ‘హ్యూమన్‌ పావర్టీ ఇండెక్స్‌’ (మానవ దారిద్య్ర సూచిక), మహిళా అభ్యున్నతిని గురించి తెలిపే ‘జెండర్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌’, మొదలైన వాటివిషయంలో కూడా పరిస్థితి ఎంతమాత్రము గౌరవప్రదంగా లేదు !-

 కుటుంబరావుగారు ‘రోడ్డుప్రక్కన శవం’ అనే కథ ఒకటి రాశారు. అవడానికి ఇది రోడ్డుప్రక్కన దిక్కులేని చావుచచ్చిన ఒక వ్యక్తి కథే అయినా – ఆ కథలో కొ.కు. బ్రతికుండగా ఒక ముష్ఠివాడికి వచ్చిన రెండు కలల గురించి చెబుతారు. మొదటి కలలో – పూరిపాక. పాక మీద సొరపాదు. ఆ పాదుకు కాయలు. పాకలో వంటచేసే ఆడకూతురు. అన్నం వాసన- పులుసు వాసన – పొయ్యి క్రింద ఎర్రెర్రగా మండుతున్న చితుకులమంట ఉంటాయి.
ఇక, రెండో కలలో ఒక పెద్ద ఇల్లు. దానికి గోడలు, వాకిళ్ళు ఉండవు. అందులో చాలా కుటుంబాలుంటాయి. అందరూ కలిసి అందరికోసం అందులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య స్నేహం, చుట్టరికం, ఇలాంటివి వున్నాయోలేదో గాని – అంతకన్నా సహజమైన, విశాలమైన, బంధం ఏదో వాళ్ళమధ్యన ఉంది. వాళ్ళందరికీ రోడ్డుప్రక్కన దిక్కులేని చావు చచ్చిన ముష్టివాడిమీదా, ఆ ముష్టివాడికి వాళ్ళమీదా, అపారమైన విశ్వాసం ఉంది.
– ఇవి ఫ్రాయిడియన్‌ కలలు కావు. అంతరంగపు లోతులోంచి దీనిని విశ్లేషించ వలసిన పని లేదు. ఇవి అచ్చంగా మనిషి బాహ్యజీవితానికి కనీస అవసరాలకు సంబంధించిన కలలు. మనిషికి ఆహారం ఉండాలి – దానిని వండుకోవడానికి కావాల్సిన ఆర్ధికస్థోమత, అవకాశం ఉండాలి. అతడికంటూ ఒక సంసారం ఉండాలి – అనే కోరికలు మొదటి కలలో కనబడుతున్నాయి. ఆకలితో మాడిచనిపోయిన ముష్ఠివాడికి ‘నా’ అంటూ ఎవరూ లేని ముష్టివానికి – ఇలాంటి కల రావడంలో ఆశ్చర్యం లేదు. ఈ కలకు వ్యక్తిపరమైన ఆకాంక్ష మూలం.
రెండో కలకూ అవసరాలు తీరడం అనేదే ప్రాతిపదిక విషయంగాని – ఆ ప్రాతిపదిక వ్యక్తిపరమైన ఆకాంక్షకు సంబంధించింది కాదు. సామాజిక ఇచ్ఛకు, సామూహిక శ్రేయస్సుకు సంబంధించినది. 

ఈ కలలు నిజమై మానవుడు వ్యక్తిపరంగాను, సమాజపరంగానూ, అభ్యున్నతి సాధించగలగాలనే తపనతో కుటుంబరావుగారు వందలాది కథలను, గల్పికలను రాశారు. ‘గల్పిక’ అనే ప్రక్రియను తనదైన రీతిలో రచించి సాహిత్యంలో దానికొక ప్రత్యేకస్థానాన్ని కల్పించిన ఘనత కొ.కు. గారిది. కథకూ, గల్పికకూ, కొంత పోలికవున్నప్పటికీ తేడా కూడా ఉంది. కథకు ఇతివృత్తం అనేది ఎంతో కొంతమేరకు తప్పనిసరిగా ఉండాలి. – ఏదో ఒక సంవత్సరంలో కాస్త వర్షాలుపడి పంట దిగుబడి పెరిగిన కారణంగా ఆర్థికవృద్ధిరేటు (జిడిపి) పెరిగితే – ‘భారత్‌ వెలిగిపోతుంది’ అంటూ డంబాలు పలికితే సరిపోదు. మానవాభివృద్ధికి దోహదం చెయ్యని సంపద వృద్ధి ఏ దేశానికీ ఎంతమాత్రమూ మేలు చెయ్యదు.

ఇలాంటి స్థితిలో ఉన్న మనం – మన గురించి మరొకసారి ఆలోచించుకోవడానికి ‘కొ.కు.’ కథలు ఇవాళ్టికి కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. అంతేకాదు, కథకుడుగా కలం పట్టిన వారి బాధ్యతను కూడా గుర్తుచేస్తాయి.
కుటుంబరావుగారే అంటారు ఒకచోట –

”- జీవితం చాలా విశాలమైంది. సంఘంలో అనేకవర్గాల వారు, వృత్తులవారు, ప్రాంతాలవారు ఉన్నారు. వీరందరికీ అనేక వందల సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించుకునే నేపథ్యంలో వారు చిత్రవిచిత్రమైన నైతిక, ఆర్ధిక పరిస్థితులకు గురి అవుతున్నారు. విస్తృతమైన ఈ జీవితాన్ని ప్రతిబింబించడానికి ఎన్ని కథలైతే చాలేటట్టు? జీవిత వైవిధ్యంతోబాటు మార్పుకూడా చాలావేగంగా జరుగుతున్నది. రెండేళ్ళ క్రితం ఒక సమస్య ఏ రూపంలో ఉన్నదో ఈనాడది ఆ రూపంలో ఉండడం లేదు. దీనిని సాహిత్యంలో చిత్రించవలసిన ఆవశ్యకత ఉన్నది” అని.
యివాళ్టి తెలుగు కథాసాహిత్యాన్ని అవలోకిస్తే, – ప్రపంచంలోనూ భారతదేశం లోనూ వచ్చిన, వస్తున్న, – మార్పులను నేటికథకులు నిశితంగా పరిశీలించడమే కాదు – పలు సందర్భాలలో వాటిని సమర్థవంతంగా కథల్లో ఆవిష్కరిస్తున్నారు. వైవిధ్యభరితంగా వున్న సమస్యలను, వాటి లోతులను, గమనించి కథల్లో అక్షరరూపం ఇస్తున్నారు. ఈ కృషి బహుముఖంగా జరుగుతున్న మాటవాస్తవమే అయినప్పటికీ, వాణిజ్య పోకడల తాకిడికి తట్టుకుని ఇది మరింత శక్తివంతంగా జరగవలసి ఉన్నది.

ఒకనాడు గురజాడ – ఆ తర్వాతి కాలంలో కొడవటిగంటి కుటుంబరావు -వంటి ఎందరో మహనీయులు పెంచిపోషించిన ఈ ప్రక్రియ మరింతగా పురోగమించేందుకు యథాశక్తి కృషిచెయ్యడమే కుటుంబరావుగారికి నిజమైన నివాళి.

– కోడూరి శ్రీరామమూర్తి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్ధిక, రాజకీయ నేపథ్యం

  1. Pingback: వీక్షణం – 121 | పుస్తకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో