శాస్త్రీయ నాట్య కళాకారులు సాహిత్యంలో రచనలు చేయడం చాలా అరుదు . ఒక వైపు శిష్యుల చేత నాట్య ప్రదర్శనలు , మరొక వైపు సుమారుగా 30 వరకు కథలు , నాటికలు , కవితలు , కవి సమ్మేళనాలు సాహిత్యం లోను రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న తిరుపతికి చెందిన శ్రీమతి కోడూరి సుమనశ్రీ అటు నాట్యం , ఇటు సాహిత్యం , మరొక వైపు సేవా భావం కలిగిన నాట్యా చారిణి కోడూరి సుమనశ్రీ తో ఈ నెల నర్తన కేళి ముఖాముఖి ……….
*మీ పూర్తి పేరు ?
నా పేరు కోడూరు సుమన .
*మీ స్వస్థలం ?
కృష్ణా జిల్లా కూచిపూడి కి రెండు మైళ్ల దూరంలో ఉన్న శ్రీ రంగపుర అగ్రహారం .
* మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ?
నాగిరెడ్డి పల్లె పి .ఎస్ .యు .పి స్కూల్ లో ప్రాధమిక విద్య , 6 వ తగారథి నుంచి 10 వ తరగతి వరకు నందలూరు జిల్లా ఉన్నత పాఠశాలలో చదివాను . నందలూరు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ , తిరుపతి శ్రీ పద్మావతి కళాశాలలో డిగ్రీ , శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం .ఏ పూర్తి చేసాను .
*మీ తొలి ప్రదర్శన ఎప్పుడు , ఎక్కడ జరింగిది ?
నాకు ఆరు సంవత్సరాల వయసులో తిరుమలలో 100 గీతాజ్ఞాన యజ్ఞం జరిగింది . దానికి మా తాతగారు ఋత్వక్కుగా వెళ్లారు . ఆయనతో పాటు మా కుటుంబం అంతా వెళ్లాము . అప్పుడు ఒక సాయంత్రం “ నీల మేఘ శ్శారీర “ కృష్ణ తరంగం చేసాను .
*మీరు చేసిన వాటిలో బాగా గుర్తున్న ప్రదర్శనలు?
తరంగం , శివ తాండవం , ఓం శంభో , ఆనంద తాండవమాడే , నవ రసములు ఈ ప్రదర్శనలు చాలా సంతృప్తినిచ్చాయి .
*మీ వైవాహిక జీవితం గురించి చెప్పండి ?
నాకు 19 93 లో వివాహం అయ్యింది . మా వారు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు . వివాహం తరవాత మావారి ఉద్యోగం కారణం కడప లో ఉన్నాము . నాకు ఇద్దరు అమ్మాయిలు ప్రణవి , ప్రణీత .
*నృత్యంలో శిక్షణ ఇవ్వడం ఎప్పుడు మొదలు పెట్టారు ?
నాకు వివాహం అయిన తరవాత కడపలో నృత్యంలో శిక్షణ ఇవ్వడ ప్రారంభించాను .
*మరి తిరుపతికి ఎప్పుడు వచ్చారు ?
మా వారికి చంద్రగిరి బదిలీ కావడంతో మేము తిరుపతి వచ్చాం .
*తిరుపతిలో భరత నాట్యం ప్రభావం ఎక్కువ కదా ?
అవునండి . ఇక్కడ కూచిపూడి చాలా తక్కువ . నేను ఇక్కడికి వచ్చాక కొన్ని పాఠశాలలో కూచిపూడి నాట్యం లో శిక్షణ ఇస్తున్నాను . నాకు కూచిపూడి అంటే ప్రాణం . హావభావ ప్రకటన , లాస్యానికి కూచిపూడి పెట్టింది పేరు .
*మీ శిష్యులు చేత చేయించిన ప్రదర్శనల గురించి చెప్పండి ?
గిన్నీస్ రికార్డు కోసం సిలికాంద్ర 20 12 లో భ్రాహ్మాంజలి , దశావతారాలు చేసాము . ప్రపంచ తెలుగు మహా సభల్లో అనాధ శ్రమం నృత్యరూపకం , మా తెలుగు తల్లికి మల్లె పూదండ కార్యక్రమం . అలాగే శివ తాండవం చేసాము .
*మీకు ఇంకా ఏ శాస్త్రీయ నాట్యాలలో ప్రవేశం ఉంది ?
తిరుపతిలో ఉండటం వలన భరత నాట్యం అభ్యసించాను . ప్రస్తుతం కథక్ నేర్చుకుంటున్నాను . మా పెద్దమ్మ కోడూరి రాజ్య లక్ష్మి గారి వద్ద కథాకళి కొంత వరకు శిక్షణ పొందాను .
* మీ రచనా వ్యాసంగం గురించి ?
కథలు , కథానికలు , లలిత గీతాలు , నాటికలు ప్రక్రియల్లో రచనలు చేసాను .
*మీవి ప్రచురిత మైన కథలు ?
భవిత , రుణాను బంధం , మాతృ దేవత , జ్ఞాపకం , శ్రద్ధాంజలి , ప్రతీక , పాంచ భౌతికం , నగ్న సత్యం , ఇంకా నాటికలు , కవితలు అచ్చు అయ్యాయి.
*ఆకాశ వాణిలో మీ రచనలు చదవడానికి ఎలా అవకాశం వచ్చింది ?
నేను ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉండేదాన్ని . A .I .R కు ఉత్తరాలు వ్రాస్తే , మీలో రాసే నైపుణ్యం ఉంది . మీరు రాసిన రచనలు ఉంటే పంపమని సూచించారు .
*ఆకాశవాణిలో ప్రసారం అయిన మొదటి రచన ?
“ బంగారం “ అనే హాస్య నాటిక పంపాను . 1997 లో గోపి గారు , మంజులా దేవి గారు ఆ నాటికను ప్రసారం చేసారు . అప్పటి నుంచి 20 05 వరకు నా రచనలు ఆకాశవాణిలో ప్రసారం అవుతూనే ఉన్నాయి .
*ఆకాశ వాణి ద్వారా ప్రసారమైన మీ కథలు , నాటిలకు గురించి చెప్పండి ?
బంగారం , పని పిల్ల , నీడ , వాన ప్రస్థం , అమ్మంటే , తెలుగు కల , దొంగ చుట్టం , భవిత , ఉగాది , స్నేహానికి అర్ధం , అద్దె ఇల్లు , పెంపకం , పెరుగన్నం , కుంపటి ఇవి కడప ఆకాశ వాణి నుంచి ప్రసారం అయ్యాయి . తరవాత తిరుపతిలో చికిత్స , ఒక్క ఒయ్ , మన ఇల్లు , బాల కార్మికులు , దశావతారాలు , రుణాను బంధం , కన్నీళ్లకు మాటలు , రచయిత్రి మాతృ రుణం మొదలైనవి ప్రసారం అయ్యాయి .
*మీరు పాల్గొన్న కవి సమ్మేళనాలు ?
ఆకాశ వాణి కవి సమ్మేళనాలు , సాహితీ సభలలో అష్టావధానం 20 05 జూన్ లో జరిగింది . శ్రీ వేంకటగిరి వీర మల్లన్న తరపున కళా పీఠం ద్వారా మహిళా వధానం 20 08 జరిగింది . చంద్రగిరిలో జరిగిన కవి సమ్మేళనం ,చిత్తూరు జిల్లా వంద ఏళ్ల పండగలో కవి సమ్మేళనం వాటిల్లో పాల్గొన్నాను .
*అందుకున్న అవార్డులు ?
అయిదు సంవత్సరాల వయసులో తిరుమలలో ఆలయంలో వద్ద భగవద్గీత చదవడం లో పాల్గొన్న పోటీలో బహుమతి . ఏడేళ్ల వయసులో ఆనంద తాండవం కి వందన అవార్డు , పదేళ్ల వయసులో స్కూటు ర్యాలీ బెస్ట్ డాన్సర్ అవార్డు , నందలూరి కళా సమితి అవార్డు , లిమ్కా అవార్డు , నటరాజ పురస్కారం , వంశీ కళా క్షేత్ర పురస్కారాలు , కల హంస పురస్కారం ,ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా 20 14 ఉగాది కి గాను “ మాతృ భాషా సేవా రత్న పురస్కారం .
*ఇప్పుడు ప్రచురణకు సిద్ధంగా ఉన్న రచనలు ?
సుమన శతకం , నీ కోసమే నే … , వెన్నెల వాకిట , ప్రతీక , ఒక సీత , ఒక కైక , శ్రీనివాస స్తుతి , తెలుగు స్తుతి రచనలు ప్రచురణలో ఉన్నాయి .
*భవిష్యత్ ప్రణాళిక ఏమిటి ?
మాతృ భాష తెలుగు పరిరక్షణకు కృషి చేయటం , అనాధ పిల్లలు శరణాలయం ఏర్పాటు చేయటం , కూచిపూడి లో సందేశాత్మక మైన నృత్య రూపకాలను రూపొందించాలి .
మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే